మోదుగుల కథ క్లోజ్ చేసేశారా..!
తాను కోరుకున్న గుంటూరు పార్లమెంటు సీటును ఇవ్వకపోయేసరికి ఆయన అలిగారన్నది వాస్తవం. అయితే.. తర్వాత.. కొంత మనసు మార్చుకున్నారు.
By: Tupaki Desk | 21 April 2025 6:30 PMమోదుగుల వేణుగోపాల్రెడ్డి. వైసీపీలో ఉన్న కీలక రెడ్డినాయకుడు. పైగా.. 2019 ఎన్నికలకు ముందు.. రెడ్డి సామాజిక వర్గాన్నిఐక్యం చేసేందుకు ఊరూ వాడా తిరిగి.. వైసీపీకి అనుకూలంగా మార్చారు. నరసరావు పేట మాజీ ఎంపీ కూడా అయిన మోదుగుల.. గత ఎన్నికల తర్వాత.. ఆయన సైలెంట్ అయిపోయారు. తాను కోరుకున్న గుంటూరు పార్లమెంటు సీటును ఇవ్వకపోయేసరికి ఆయన అలిగారన్నది వాస్తవం. అయితే.. తర్వాత.. కొంత మనసు మార్చుకున్నారు.
పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యారు. కొన్నాళ్ల కిందట తిరిగి ఆయన టీడీపీ చెంతకు చేరాలని అనుకు న్నా.. కుదరలేదు. ఇక, ఇప్పుడు ఆయన ప్రస్తావన మరోసారి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి కారణం.. ఇప్పుడు కూడా.. ఆయనను పార్టీ అధినేత జగన్ పట్టించుకోవడం లేదు. ఇటీవల ఆయన స్వయంగా జగన్ను కలిశారు. పార్టీ కార్యక్రమాల పేరుతో ఆయన కలిసి.. తనకు గుంటూరు ఎంపీ ఇంచార్జ్ పోస్టు ఇవ్వాలని కోరుకున్నారు.
కానీ.. జగన్ నుంచి నిరాశే వ్యక్తమైంది. ముందు గ్రాఫ్ పెంచుకో అన్నా.. అని ఉచిత సలహా ఇచ్చారట జగన్. దీంతో మోదుగుల రగిలిపోతున్నారు. రెడ్డి సామాజిక వర్గాన్ని ఐక్యం చేసి.. జగన్ను గెలిపించానని.. ఇప్పుడు తనకే ఎదురు తిరుగుతున్నారని ఆయన చెబుతున్నారు. గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా వైసీపీ తరఫున పోటీచేయాలని అనుకున్నానని.. కానీ, ఎక్కడ నుంచో తెచ్చిన వ్యక్తికి ఇచ్చారని.. ఇప్పడు ఆయన కూడా పార్టీని వదిలేసి వెళ్లిపోయారని చెబుతున్నారు.
పార్టీనినమ్ముకుంటే ఇంతేనా? అన్నది మోదుగుల మాట. అయితే.. పార్టీ పరంగా వేరే చర్చనడుస్తోంది. మోదుగుల బయటకు వచ్చినా.. ఆయన వ్యవహారాలన్నీ.. టీడీపీతోనే సాగుతున్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇది నచ్చకే చాలా మందిని పక్కన పెట్టారని.. కాబట్టి మోదుగుల తనను తాను మార్చుకోవాలన్నది వారి సూచన. వ్యాపార పరంగా టీడీపీ నాయకులతో కలిసి ఉన్నది వాస్తవమే. కానీ.. రాజకీయ పరంగా మాత్రం మోదుగుల డిస్టెన్స్ పాటిస్తున్నారు. కానీ, వైసీపీ లో ఆయన హవా కనిపించడం లేదు.