Begin typing your search above and press return to search.

‘భూమి అంచుల వరకూ వెంబడించి’... మోడీ మాస్ వార్నింగ్!

జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఘోర ఘటన దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 April 2025 9:30 AM
‘భూమి అంచుల వరకూ వెంబడించి’...  మోడీ మాస్  వార్నింగ్!
X

జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఘోర ఘటన దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే 'ఎక్స్' వేదికగా స్ట్రాంగ్ గా స్పందించిన ప్రధాని మోడీ.. అనంతరం సీసీఎస్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా... పాకిస్థాన్ తో సింధూనదీ జలాల ఒప్పందాన్ని నిలిపేయాలని నిర్ణయించుకున్నారు.

సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) భేటీలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అట్టారీ - వాఘా ల్యాండ్ క్రాసింగ్ ను తక్షణమే మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా.. ఆ ఘటన తర్వాత నేరుగా ప్రజలతో మాట్లాడారు మోడీ. ఈ సందర్భంగా ఉగ్రమూకలకు డబుల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

అవును... పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై ప్రధానమంత్రి నరేంద్రం మోడీ తొలిసారిగా నేరుగా స్పందించారు. ఈ సందర్భంగా దాడి చేసినవారు, దాడి వెనుక ఉన్న కుట్రదారులకు వారి ఊహకు మించిన శిక్ష పడుతుందని బలమైన సందేశం పంపించారు. బీహార్ లోని మధుబనిలో జరిగిన కార్యక్రమంలో మోడీ ఈ మేరకు స్పందించారు.

పాకిస్థాన్ పేరు ఎత్తకుండానే... పహల్గాం దాడి వెనుక ఉన్న కుట్రదారులకు వారి ఊహకు మించిన శిక్ష పడుతుందని మోడీ బలమైన పదజాలతో కూడిన సందేశాన్ని పునరుద్ఘాటిస్తూ.. ప్రతీ ఉగ్రవాదినీ, ‘వారికి మద్దతు ఇచ్చేవారిని’ భారత్ గుర్తిస్తుందని.. వారిని వెంటాడి శిక్షిస్తుందని అన్నారు.

ఇదే క్రమంలో... ఏప్రిల్ 22 మధ్యాహ్నం ప్రశాంతమైన వాతావరణంలో పచ్చిక బయళ్లలో ఉన్న 26 మంది ప్రాణాలు బలిగొన్న ఈ దాడి.. పర్యాటకులపై జరిగిన దాడి కాదు.. భారతదేశ ఆత్మపై జరిగిన దాడిగా భావిస్తున్నామని అన్నారు. ఈ రోజు బీహార్ గడ్డపై ఉండి మొత్తం ప్రపంచానికి చెబుతున్నానంటూ మోడీ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.

ఇందులో భాగంగా... ప్రతీ ఉగ్రవాదిని, వారికి మద్దతు ఇచ్చేవారిని గుర్తించి, కనిపెట్టి భారతదేశం శిక్షిస్తుందని.. తాము వారిని భూమి అంచుల వరకూ వెంబడిస్తామని.. శిక్ష చాలా కఠినంగా ఉంటుందని.. ఉగ్రవాదుల ఊహకు అందదని అన్నారు. భారతదేశ స్ఫూర్తిని ఈ ఉగ్రవాదం ఎప్పటికీ విచ్ఛిన్నం చేయదని ప్రధాని నొక్కి చెప్పారు.