జగన్ ఉదాసీనం: మార్కాపురం పాయే.. !
ఇలాంటి వాటిలో తాజాగా మార్కాపురం తెరమీదికివచ్చింది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మార్కాపురం బలమైన అండగా నిలిచింది.
By: Tupaki Desk | 13 May 2025 9:30 PMపార్టీ అధినేతగా అవసరం వచ్చినప్పుడు దూకుడు ప్రదర్శించాలి. నాయకులను లైన్లో పెట్టుకోవాలి. కు దిరితే కఠినచర్యలైనా తీసుకుని పరిస్థితిని సర్దుమణుగేలా చేసుకోవాలి. కానీ.. ఈ నియమాలు.. సూత్రాలు వైసీపీ అధినేత జగన్కు ఎక్కడా పట్టినట్టు కూడా కనిపించడం లేదు. ఫలితంగా స్థానిక సంస్థలను కొలాప్స్ చేసుకుంటున్నారు. కూటమి వ్యూహాత్మకంగా ఒడిసి పట్టుకుంటున్న స్థానిక సంస్థలు కొన్నయితే.. వైసీపీ చేజేతులా పోగొట్టుకుంటున్నవి మరికొన్ని.
ఇలాంటి వాటిలో తాజాగా మార్కాపురం తెరమీదికివచ్చింది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మార్కాపురం బలమైన అండగా నిలిచింది. వైసీపీ తరఫున పెద్ద సంఖ్యలో కౌన్సిలర్లు గెలిచారు. అయితే.. పార్టీని ముందుండి నడిపిని వారిలో చైర్మన్ కుర్చీ కోసం పోటీ ఏర్పడింది. నిజానికి అందరూ కష్టపడినా.. ఒకరిద్దరు ఎప్పుడూ ముందుండి నడిపించినట్టే.. మార్కాపురంలోనూ అదే జరిగింది. ఈ క్రమంలో మధ్యే మార్గంగా.. ఇద్దరు నాయకులకు రాజీ చేశారు.
వీరిలో ఒకరు చిర్లంచెర్ల బాలమురళీకృష్ణ, మరొకరు చెప్పల్లి కనకదుర్గ. వీరి ద్దరూ కూడా ఎన్నికల సమ యంలో పార్టీకోసం పనిచేశారు. దీంతో చైర్మన్ గిరీ కోసం పోటీ పడగా.. ఇద్దరికీ రెండున్నర సంవత్సరాల చొప్పున పదవిని పార్టీ అధిష్టానం సర్దుబాటు చేసింది. దీంతో తొలి విడతలో చిర్లంచెర్ల బాలమురళీ కృష్ణ చైర్మన్ గిరీ తీసుకున్నారు. తర్వాత.. వరుసలో కనకదుర్గ ఉంది. అయితే.. రెండున్నరేళ్లు పూర్తయిన తర్వాత.. సహజంగానే తన పదవిని వదులుకోవాల్సిన బాలమురళీ కృష్ణ.. దానికి ససేమిరా అన్నారు.
ఈ క్రమంలో కనకదుర్గ పార్టీ అధిషష్టానం వైపు కూడా చూశారు. రెండున్నరేళ్ల ఒప్పందాన్ని కృష్ణ కాలరా శారని జోక్యం చేసుకోవాలని కోరారు. కానీ, జగన్ ఉదాసీనంగా వ్యవహరించారు. దీంతో చూసి చూసి విసిగి పోయిన కనకదుర్గ.. కూటమిలో ని ఓ పార్టీ చెంతకు చేరిపోయారు. ఆ వెంటనే బాల మురళీపై అవిశ్వాస తీర్మానంప్రవేశ పెట్టారు. దీనిని ఎట్టి పరిస్థితిలోనూ ఆమోదించడంతోపాటు.. బాలమురళిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు.
ఇదే జరిగితే.. మార్కాపురం వైసీపీ నుంచిపోవడం ఖాయమని అంటున్నారు పార్టీ నాయకులు. నిజానికి గతంలో వివాదం తెరమీదికి వచ్చినప్పుడే.. జగన్ జోక్యం చేసుకుని ఉంటే సమస్య అప్పట్లోనే పరిష్కారం అయ్యేదని.. కానీ, జగన్ ఉదాసీనంగా వ్యవహరించడంతో ఏకంగా మార్కాపురమే పోయేలా ఉందని చెబుతున్నారు.