Begin typing your search above and press return to search.

ఇది మామూలు పార్టీ కాదు... మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక అప్డేట్!

తాజాగా మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసు హైదరాబాద్ లో ఒక్కసారిగా కలకలం రేపిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   31 Aug 2023 6:52 AM GMT
ఇది మామూలు పార్టీ కాదు... మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక అప్డేట్!
X

పార్టీలందు రేవ్ పార్టీలు వేరయా.. ఇందులో డ్రగ్స్ పాత్రే కీలకమయా అనేది నానుడి! ఈ క్రమంలో తాజాగా మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసు హైదరాబాద్ లో ఒక్కసారిగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ రేవ్ పార్టీలో ఒక సినీ నిర్మాతతో పాటు ఐదుగురు ప్రముఖంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తుంది. ఈ సమయంలో ఈ పార్టీకి సంబంధించి కీలక విషయాలు తెరపైకి వస్తున్నాయి.

అవును... భాగ్యనగరంలో సంచలనం సృష్టించిన మాధాపూర్ డ్రగ్స్ పార్టీలో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భారీగా డ్రగ్స్‌ ను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో సినీ నిర్మాతతో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు! దీనిపై అధికారుల విచారణ వేగవంతం చేశారు. దీంతో ఈ కేసులో కీలక అంశాలు వెలుగులోనికి వచ్చాయని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... ఈ దాడుల్లో సినీ నిర్మాత వెంకట్‌ తో పాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగు సినిమా ఫైనాన్సర్ వెంకట్ అద్వర్యంలో జరిగినట్లు తెలుస్తోన్న ఈ పార్టీకి గోవా నుండి డ్రగ్స్ తెచ్చి నిర్వయిస్తున్నారని సమాచారం.

అయితే గతంలోనే వెంకట్ ఇలాంటి పార్టీలు నిర్వహిస్తున్నాడని సమాచారం ఉండటంతో... అతని కదిలికలపై గత మూడు నెలలుగా నార్కోటిక్ బ్యూరో నిఘా పెట్టింది. ఈ సమయంలో ఆయన ఫోన్ నుంచి వివరాలు సేకరించాలని చూసిన అధికారులు... ఆయన ఫోన్ మిస్సయినట్లు చెబుతున్నారు. దీంతో... వెంకట్‌ ఫోన్‌ ఎలా మిస్‌ అయ్యిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఎంతో కీలక సమాచారం ఉండొచ్చని అధికారులు చూస్తున్న.. వెంకట్ ఫోన్ మిస్సయ్యిందా.. లేక, కావాలనే మిస్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. అందులో కచ్చితంగా బడా బడా వ్యక్తుల పేర్లు ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో కావాలనే ఫోన్ ను మాయం చేశారనే అనుమానం వ్యక్తం అవుతుందని తెలుస్తోంది.

ఈ క్రమంలో వెంకట్ నుంచి కొకైన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. దీంతో వీరికి డ్రగ్స్ ఎక్కడ నుంచి వచ్చింది.. ఎలా వచ్చింది.. వీరి వద్ద ఇంకా ఎంత మొత్తంలో డ్రగ్స్ ఉన్నాయి అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

ఆ సంగతి అలా ఉంటే... డ్రగ్స్ కేసు వ్యవహారం వెలుగులోకి రావడంతో మరుసారి టాలీవుడ్ లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లో ఎక్కడ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చినా, దానికి కచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమలోని వ్యక్తులతో సంబంధం ఉండటం చర్చనీయాంశం అయ్యిందని అంటున్నారు.

కాగా... ఈ మధ్యకాలంలో "కబాలి" తెలుసు సినిమా నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసు వ్యవహారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ కేసులో కేపీ చౌదరిని అరెస్ట్ చేసిన విచారించడగా టాలీవుడ్ కు చెందిన పలువురు ఆర్టిస్టుల పేర్లను ప్రస్తావించారంటూ కథనాలొచ్చాయి.

దీంతో వారంతా సోషల్ మీడియా వేదికగా ఆ ఆరోపణలను ఖండిస్తూ... వివరణ ఇచ్చారు. వీరిలో ఒకరిద్దరు అయితే ఒకటికి రెండు సార్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి డ్రగ్స్ వ్యవహారం వెలుగు చూడటం.. అందులో కూడా టాలీవుడ్ జనం ఉండటం హాట్ టాపిక్ గా మారింది!