పాక్ డీఎన్ఏ లో టెర్రరిజం.. ఈ ఆర్మీ అధికారి సంజ్ఞ నిజం!
పహల్గాం ఉగ్రదాడిలో పర్యాటకులను చంపిన ఘటన విషయంలో పాక్ పై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
By: Tupaki Desk | 26 April 2025 4:52 AMపహల్గాం ఉగ్రదాడిలో పర్యాటకులను దారుణంగా చంపడంపై ప్రపంచవ్యాప్తంగా పాకిస్థాన్ పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు దేశాధినేతలు భారత్ కు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో.. లండన్ లో పాక్ హైకమిషన్ వెలుపల భారతీయ సమాజం తీవ్ర నిరసన చేపట్టింది. ఈ సమయంలో ఓ పాక్ ఆర్మీ అధికారి సంజ్ఞ పై తీవ్ర విమర్శలు వెల్లివెత్తుతున్నాయి.
అవును... పహల్గాం ఉగ్రదాడిలో పర్యాటకులను చంపిన ఘటన విషయంలో పాక్ పై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో లండన్ లోని పాకిస్థాన్ హైకమిషన్ వెలువపల భారతీయ సమాజ సభ్యులు తీవ్ర నిరసన చేపట్టారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన పాశవిక దాడిని నిరసనకారులు ఖండించారు. ఈ సమయంలో అక్కడ ఉద్రిక్తత సృష్టించింది.
ఈ సందర్భంగా అక్కడున్న భారతీయులు జాతీయ జెండాలు, బ్యానర్లు, ప్లకార్డులతో పాక్ హైకమిషన్ వద్దకు వచ్చారు. అమాయకుల మరణం పట్ల నిరసనకారులు విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా... 'నేను హిందువుని' అని రాసిన కార్డులు పట్టుకుని.. 'భారత్ మాతా కీ జై', 'పాకిస్థాన్ డౌన్ డౌన్' నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన నిరసనకారులు.. పాకిస్థాన్ ఒక ఉగ్రవాద కర్మాగారాన్ని నడుపుతోందని.. అందుకే పహల్గాంలో 26 మంది మరణించారని అన్నారు. ఈ సమయంలో అక్కడకు చేరుకున్న పాకిస్తానీయులు.. నిరసనకారుల ముందుకు వచ్చి భారత్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే నినాదాలు చేశారు. దీంతో.. లండన్ పోలీసులు జోక్యం చేసుకున్నారు.
ఈ సమయంలోనే పాకిస్థాన్ ఆర్మీ అధికారి తైమూర్ రహత్ రెచ్చిపోయారు. పాక్ హైకమిషన్ ముందు నిరసన తెలుపుతున్న భారతీయులవైపు చూస్తూ "మీ గొంతు కోస్తా" అని సంజ్ఞలు చేస్తూ వార్నింగ్ ఇచ్చారు. ఓ అధికారి ఇలా రెచ్చిపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే... పాకిస్థాన్ డీ.ఎన్.ఏ లోనే టెర్రరిజం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.