Begin typing your search above and press return to search.

లోకేష్ వర్సెస్ ఆర్జీవీ... మధ్యలో గ్రాఫిక్స్ టాపిక్!

ఇందులో భాగంగా లోకేష్ ది అవధులు లేని అజ్ఞానం అన్నట్లుగా ట్వీట్ చేశారు!

By:  Tupaki Desk   |   12 March 2024 10:52 AM GMT
లోకేష్  వర్సెస్  ఆర్జీవీ... మధ్యలో గ్రాఫిక్స్ టాపిక్!
X

“సిద్ధం” సభల్లో జనాలు లేరు.. దీంతో గ్రీన్ మ్యాట్ వేసి, గ్రాఫిక్స్ చేసి చూపిస్తూ, ప్రజలను మాయచేస్తునారనే వాదనను తెరపైకి తెచ్చారు నారా లోకేష్. దీనికి సాక్ష్యంగా అంటూ కొన్ని ఫోటోలను అక్కడక్కడా మార్క్ చేసి నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో ఈ ఇష్యూ వైరల్ గా మారింది. లోకేష్ పై నెట్టింట విరుచుకుపడుతున్నారు వైసీపీ నెటిజన్లు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్జీవీ ఈ విషయంపై స్పందించారు. ఇందులో భాగంగా లోకేష్ ది అవధులు లేని అజ్ఞానం అన్నట్లుగా ట్వీట్ చేశారు!

అవును... “సిద్ధం” సభలకు జనాలు రావడం లేదని.. గ్రౌండ్స్ లో గ్రీన్ మ్యాట్స్ వేసి, జనాలను గ్రాఫిక్స్ లో యాడ్ చేసి చూపిస్తున్నారని లోకేష్ విమర్శించారు. ఈ క్రమంలో... "ఆంధ్రప్రదేశ్ సీఎం ఏకంగా మార్ఫింగ్ ఫోటోలు వేసి, నా మీటింగ్ కి ప్రజలు వచ్చారు అని చెప్పుకోవటం దేశ చరిత్రలో ఎప్పుడైనా చూసారా? డ్రోన్ షార్ట్స్ తో, గ్రీన్ మ్యాట్ తో నిన్న దొరికిపోయారు. అందుకే, ఇప్పుడు ఏకంగా ఫోటోలు మార్ఫింగ్ చేసి వదిలారు." అని అన్నారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను మార్క్ చేసిమరీ పోస్ట్ చేశారు.

ఈ సమయంలో... లోకేష్ ట్వీట్ కి రియాక్ట్ అయ్యారు రాం గోపాల్ వర్మ. ఇందులో భాగంగా... "మీ అజ్ఞానానికి అవధులు లేవు.. సినిమా పరిశ్రమలో మీకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఎవరైనా లైవ్ స్ట్రీమింగ్ ఈవెంట్ లో గ్రాఫిక్స్ ఎలా చేయగలరని మీరు వాళ్లను అడగలేదా..? ముందు ఆ విషయం తెలుసుకోండి" అని లోకేష్ ట్వీట్ కు రీ ట్వీట్ చేశారు వర్మ.

కాగా... సిద్ధం సభల్లో జనం అంతా గ్రాఫిక్స్ అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై నెట్టింట పెద్ద దుమారమే రేగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. లోకేష్ విత్ ఫ్రూఫ్స్ చూపించారని టీడీపీ జనాలు కామెంట్ చేస్తే... లైవ్ వీడియోను ఎలా గ్రాఫిక్స్ చేస్తారో స్టాన్ ఫోర్డ్ లో చినబాబుకి ప్రత్యేకంగా నేర్పించారా అని వైసీపీ నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు! ఈ క్రమంలోనే ఆర్జీవీ కూడా ఎంటరయ్యారు!