Begin typing your search above and press return to search.

కాన్సర్ బారిన పడిన వేల్స్ యువరాణి

తాను క్యాన్సర్ బారిన పడినట్లుగా ఆమె పేర్కొన్నారు. 42 ఏళ్ల కేట్ మిడిల్టన్ బ్రిటన్ యువరాజు విలియం సతీమణి అన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   23 March 2024 4:00 AM GMT
కాన్సర్ బారిన పడిన వేల్స్ యువరాణి
X

కొన్ని నెలలుగా బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పోయి.. నాలుగు రోజుల క్రితమే భర్తతో బయట కనిపించిన వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్ తాజాగా షాకింగ్ నిజాన్ని వెల్లడించారు. నెలల తరబడి బాహ్య ప్రపంచంలోకి రాకుండా ఉండిపోయిన ఆమెకు ఏం జరిగిందన్న అంశంపై బోలెడన్ని వార్తలు ప్రసారం అయ్యాయి. అయితే.. ఆమె మళ్లీ కనిపించటంతో పలువురు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే శుక్రవారం ఆమె స్వయంగా ఒక ప్రకటన చేశారు.

తాను క్యాన్సర్ బారిన పడినట్లుగా ఆమె పేర్కొన్నారు. 42 ఏళ్ల కేట్ మిడిల్టన్ బ్రిటన్ యువరాజు విలియం సతీమణి అన్న సంగతి తెలిసిందే. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. తాను ప్రస్తుతం కీమోథెరపీ తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతానికి తాను బాగానే ఉన్నానని.. మరింత శక్తివంతంగా తయారయ్యేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పారు.

తమ ప్రైవసీని గౌరవించాల్సిందిగా ఆమె కోరారు. విలియంను ఆమె 2001లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బ్రిటన్ రాజు.. విలియం తండ్రి ఛార్లెస్ 3 క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వేల్స్ యువరాణి సైతం క్యాన్సర్ బారిన పడటం షాకింగ్ గా మారింది. ఆమె ఏ క్యాన్సర్ బారిన పడ్డారన్న విషయాన్ని వెల్లడించలేదు.