Begin typing your search above and press return to search.

కర్ణాటకలో శుభలగ్నం... భర్తను అమ్మేసిన భార్య!

వివరాళ్లోకి వెళ్తే... కర్ణాటకలోని మండ్య సమీప ఓ గ్రామంలో భార్య, భర్త ఉంటున్నారు. వీరిద్దరూ చాలా అన్నోన్యంగా ఉంటున్నారనే చాలా మంది భావించారు!

By:  Tupaki Desk   |   21 Oct 2023 3:50 AM GMT
కర్ణాటకలో శుభలగ్నం... భర్తను అమ్మేసిన భార్య!
X

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1994లో వచ్చిన సినిమా “శుభలగ్నం” చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో డబ్బు కోసం ఆమని పాత్ర.. తన భర్త జగపతిబాబు పాత్రని, రోజా పాత్రకు అమ్మేస్తుంది. ఆ సమయంలో.. "మంగళ సూత్రం అంగడి సరుకా... కొనగలవా చెయ్యి జారాకా" అనే ఫంక్తులతో వచ్చిన ఒక పాట ఇప్పటికీ వన్ ఆఫ్ ది తెలుగు హిట్ సాంగ్ అనే చెప్పాలి. కట్ చేస్తే... తాజాగా నిజజీవితంలోకూడా అలాంటి సంఘటనే జరిగింది.

అవును... కట్టుకున్న భర్తను మరొకరికి అమ్మేసిన ఆధునిక మహాభారత సన్నివేశం తాజాగా కర్నాటకలో జరిగింది. తన భర్తను స్థానికంగా ఉండే మరో మహిళకు ఐదు లక్షల రూపాయలకు అమ్మేసింది. ఈ విషయం స్థానికంగా అత్యంత చర్చనీయాంశం అయ్యింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఈ "శుభలగ్నం"కు కారణం... తన భర్తకు స్థానిక మహిళతో... అక్రమ సంబంధం ఉండటమే!

వివరాళ్లోకి వెళ్తే... కర్ణాటకలోని మండ్య సమీప ఓ గ్రామంలో భార్య, భర్త ఉంటున్నారు. వీరిద్దరూ చాలా అన్నోన్యంగా ఉంటున్నారనే చాలా మంది భావించారు! ఈ సమయంలో ఆ భర్త స్థానికంగా ఉంటున్న మరో మహిళతో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టాడు. ఆ సాన్నిహిత్యం కాస్తా పడకగదివరకూ చేరింది. ఈ విషయం అతని భార్య గమనించింది. గుట్టుచప్పుడు కాకుండా సైలంట్ గా ఉంది!

ఈ క్రమంలో ఆమె భర్త, స్థానిక మహిళతో పడగగదిలో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది! దీంతో ఇద్దరు మహిళలూ కొప్పులు పట్టుకున్నంత పనిచేశారు. కట్ చేస్తే వ్యవహారం పంచాయతీకి చేరింది. ఈ సమయంలో స్థానిక మహిళ... "నీ భర్త నా దగ్గర ఐదు లక్షల రూపాయలు తీసుకున్నాడు. అది కట్టి నీ భర్తను నువ్వు తీసుకెళ్లు" అని వాదించింది.

ఇదే పెద్ద ట్విస్ట్ అనుకుంటే... దీనికి ఆ భార్య మరో ట్విస్ట్ ఇచ్చింది. అందులో భాగంగా... "ఇలాంటి భర్త నాకు వద్దు... నాకే రూ.5 లక్షల మనోవర్తి ఇచ్చి, నువ్వే అతన్ని ఉంచుకో" అని ఆఫర్ ఇచ్చింది! అంతేకాదు... ఆ సొమ్ము చెల్లించడానికి మానవతా దృక్తధంతో నెలరోజులు గడువు కూడా ఇచ్చింది.

దీంతో నోరెళ్లబెట్టి చూడటం స్థానిక పంచాయతీలోని పెద్దల వంతైందని తెలుస్తుంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే... అతడికోసం ఐదు లక్షలు ఇవ్వడానికి.. అలా ఐదూ లక్షలు అతని భార్యకు ఇచ్చి, అతడిని సొంతం చేసుకోవడానికి, స్థానిక మహిళ అంగీకరించింది. ఇలాంటి ఎన్నో ట్విస్టులు, జలక్కులతో జరిగిన ఈ పంచాయతీ... పెద్దల ప్రమేయం పెద్దద్గా లేకుండానే వాళ్లలో వాళ్లు తీర్పు ఇచ్చుకుని ముగిసింది.

దీంతో నెలరోజుల్లో ఐదులక్షలు ఇవ్వడానికి సదరు స్థానిక మహిళ అంగీకరించడం.. ఆ మహిళ వెనక్కి వెళ్లిపోవడం.. ఇతడిని కొనుకున్న మహిళ తీసుకునిపోవడం చక చకా జరిగిపోయాయని తెలుస్తుంది. ఇలా వీరిద్దరూ చేసుకున్న "శుభలగ్నం" టైపు రాజీ ఒప్పందం చూసి పంచాయితీ ప్రతినిధులు, గ్రామస్థులు అవాక్కయ్యారని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా వైరల్ గా మారింది.