Begin typing your search above and press return to search.

కంగనా రనౌత్ ప్రత్యర్థిగా ఆసక్తికర ప్రతిపాదన!

ఈ సమయంలో తాజాగా కంగనా ప్రత్యర్థి టాపిక్ తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   13 April 2024 12:31 PM GMT
కంగనా రనౌత్  ప్రత్యర్థిగా ఆసక్తికర ప్రతిపాదన!
X

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా పలువురు సినీ సెలబ్రెటీలు పోటీచేసే స్థానలలోని వారికి ఎదురెళ్లే ప్రత్యర్థుల విషయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఆయా నియోజకవర్గాలపై ఆ రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుండటం గమనార్హం. ఈ సమయంలో తాజాగా కంగనా ప్రత్యర్థి టాపిక్ తెరపైకి వచ్చింది.

అవును... సాధారణంగా లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఆయా జిల్లాలోనూ, ఆయా రాష్ట్రాల్లోనూ మాత్రమే బలమైన చర్చ జరుగుతుంటుంది! కానీ... కొంతమంది సెలబ్రెటీలు పోటీ చేసే నియోజకవర్గాలపై మాత్రం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటుంది.. ప్రజలకు ఆసక్తినెలకొని ఉంటుంది. ఈసమయంలో... హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గం కూడా అటువంటి అటెన్షన్ నే సంపాదించుకుంది! అందుకు కారణం... కంగనా!

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌ లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా... భారతీయ జనతా పార్టీ తరఫున కంగనా రనౌత్‌ బరిలోకి దిగారు. ఈ సమయంలో ఆమెకు పోటీగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడే అభ్యర్థి ఎవరనేది ఆసక్తిగా మారింది. ఈ సమయంలో ఆ అభ్యర్థి పేరు తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... మండి లోక్ సభకు కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తారని చెబుతున్నారు. ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ ప్రకటించారు! ప్రతిభా సింగ్ కుమారుడే అయిన విక్రమాదిత్య సింగ్ కు స్థానికంగా మంచి పలుకుబడి ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో... మండి ప్రజలు ఎల్లప్పుడూ తమతో ఉంటారని, ఈ సారి కూడా ఉంటారని ప్రతిభా సింగ్ ధీమాతో చెబుతున్నారు.

దీంతో... కంగనా రనౌత్‌ పై కాంగ్రెస్ పార్టీ గట్టి అభ్యర్థినే బరిలోకి దింపిందని అంటున్నారు పరిశీలకులు. పైగా కంగనాను కచ్చితంగా ఓడించి తీరాలని కాంగ్రెస్ పార్టీ పలు రకాల వ్యూహాలు రచిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే విక్రమాధిత్య సింగ్ పేరు తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు. మరి మండి ప్రజలు ఎవరిని బలపరుస్తారనేది వేచి చూడాలి!