Begin typing your search above and press return to search.

కమల్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయట్లేదో తెలుసా?

దేశవ్యాప్తంగా జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా తొలిదశ పోలింగ్ తమిళనాడులో జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 April 2024 10:06 AM GMT
కమల్  పార్టీ ఈ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయట్లేదో తెలుసా?
X

దేశవ్యాప్తంగా జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా తొలిదశ పోలింగ్ తమిళనాడులో జరుగుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాదిలో ఎలాగైనా సత్తాచాటాలంటూ బీజేపీ తీవ్రంగా కృషిచేస్తుండగా.. ద్రావిడ పాలనను కాదని బీజేపీకి అంత ఛాన్స్ ఇవ్వకూడదంటూ డీఎంకే బలంగా ఉంది! ఈ కీలక ఎన్నికల్లో మక్కల్‌ నీది మయ్యం (ఎం.ఎన్.ఎం) మాత్రం పోటీ చేయడం లేదు. ఈ రోజు ఆ పార్టీ అధినేత కమల్ హాసన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు అంతే..!

అవును... దక్షిణాదిలో తమ సత్తా చాటాలంటూ బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న వేళ, ఆ పాచికలు పారవంటూ డీఎంకే బలంగా నిలబడుతున్న సమయంలో కమల్ హాసన్ పార్టీ ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. వాస్తవానికి ఈ విషయాన్ని కమల్ ఇప్పటికే వెల్లడించారు. తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్‌ మధ్య కూటమిలో కమల్‌ హాసన్‌ కు చెందిన మక్కల్‌ నీది మయ్యం పార్టీ కూడా చేరింది.

ఈ సమయంలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ తో కమల్‌ హాసన్‌ భేటీ అయ్యి లోక్‌ సభ ఎన్నికల్లో మద్దతు ఇచ్చే అంశంపై చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో... 2025 రాజ్యసభ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీకి ఒక రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. దీంతో... ఈ లోక్ సభ ఎన్నికల్లో కూటమిలో పోటీ నుంచి తప్పుకున్న ఎం.ఎన్.ఎం.... బయట నుంచి మద్దతు ప్రకటించింది.

నాడు ఆ సమయంలో స్పందించిన కమల్.. ఈ లోక్ సభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదో అప్పుడే స్పష్టత ఇచ్చారు. ఇందులో భాగంగా... దేశ ప్రయోజనాలను కాంక్షించి కూటమిలో చేరినట్లు చెబుతూ.. ఈ లోక్‌ సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని.. డీఎంకే - కాంగ్రెస్‌ కూటమికే పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.

కాగా... తమిళనాడులోని 39 లోక్‌ సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో కూటమి తరఫున కమల్ హాసన్ ఎం.ఎన్‌.ఎం పార్టీ ప్రచారం చేయనుంది.