Begin typing your search above and press return to search.

గద్దర్ ఆత్మ శాంతించు గాక...కాంగ్రెస్ ఉండాల్సిన పార్టీ...!

ముఖ్యంగా చెప్పుకోవాలీ అంటే గద్దర్ కుమార్తె డాక్టర్ జీవీ వెన్నెలకు టికెట్ ఇచ్చింది. ఆమెకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ కల్పించింది.

By:  Tupaki Desk   |   27 Oct 2023 6:29 PM GMT
గద్దర్ ఆత్మ శాంతించు గాక...కాంగ్రెస్ ఉండాల్సిన పార్టీ...!
X

కాంగ్రెస్ లో మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో ఉన్న విధానాలు మార్చుకుని వర్తమానానికి తగిన విధంగా ఆ పార్టీ తయారవుతోంది. ముఖ్యంగా తన పట్ల విశ్వననీయతను ఇటు ప్రజలతో పాటు నాయకులలో పెంచుకుంటోంది. కాంగ్రెస్ మాట ఇస్తే చేయదు అన్న అపప్రధని ఆ పార్టీ తొలగించుకుంటోంది. లేకపోతే కాంగ్రెస్ లో చేరిన దాదాపుగా ఇరవై మంది వరకూ నేతలకు టికెట్ ఇవ్వడం అంటే మాటలా. కానీ అవి చేతలలో కాంగ్రెస్ చూపించింది.

అంతేకాదు తన చివరి రోజులలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ కాంగ్రెస్ తో సన్నిహితంగా మెలిగారు. ఆయన బతికి ఉంటే ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఉండేవారు. అయితే కొద్ది నెలల క్రితం అనారోగ్య కారణాలతో గద్దర్ మరణించారు. ఆయన కుటుంబం కాంగ్రెస్ నే నమ్ముకుంది. ఇపుడు వారి నమ్మకాన్ని వమ్ము చేయలేదు కాంగ్రెస్

కాంగ్రెస్ రెండవ విడత జాబితాలో గద్దర్ కుమార్తె వెన్నెలకి టికెట్ ఇచ్చి న్యాయం చేసింది. దీంతో గద్దర్ ఆత్మ శాంతిస్తుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏకంగా నలభై మంది అభ్యర్ధులతో రెండవ జాబితా రిలీజ్ చేసింది. అందులో చాలా మందికి చోటు దక్కింది.

ముఖ్యంగా చెప్పుకోవాలీ అంటే గద్దర్ కుమార్తె డాక్టర్ జీవీ వెన్నెలకు టికెట్ ఇచ్చింది. ఆమెకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ కల్పించింది. దీంతో గద్దర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెన్నెల కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం నుంచి చురుకుగా ఉంటూ వస్తున్నారు.

దాంతో పాటు గద్దర్ మీద కాంగ్రెస్ అభిమానంగా ఉంటూ వచ్చింది. గద్దర్ చనిపోయాక కూడా ఆయన అంత్యక్రియల విషయంలో కాంగ్రెస్ దగ్గరుండి అన్నీ చూసుకుంది. ఇక కాంగ్రెస్ గద్దర్ కుటుంబానికి టికెట్ ఇస్తుందా అని ఒక దశలో చర్చ జరిగిన మాట వాస్తవం. తమను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడంలేదు అని గద్దర్ సతీమణి విమల కూడా ఇటీవల కాలంలో ఫైర్ అయ్యారు.

ఎట్టకేలకు కాంగ్రెస్ తన మాటను మరచిపోలేదని రుజువు చేసుకుంది. గద్దర్ మీద ప్రేమతో ఆయన కుమార్తెకు అవకాశం ఇచ్చింది. అంతే కాదు బడుగు బలహీన వర్గాల పట్ల తన అభిమానాన్ని చిత్తశుద్ధిని చాటుకుంది. ఇక గద్దర్ కుమార్తె వెన్నెల ఎన్నికల బరిలో నిలబడడానికి కారణం ఉంది.

ఆమె అన్న సూర్యం సున్నిత మనస్కుడు అని చెబుతారు. ఆయన రాజకీయాలను తట్టుకోలేరని అందువల్లతాను పోటీ చేస్తున్నట్లుగా వెన్నెల గతంలో ప్రకటించారు. మొత్తం మీద గద్దర్ ఫ్యామిలీకి న్యాయం జరిగింది. వారికి బాగా పలుకుబడి కలిగిన కూకట్ పల్లిలో టికెట్ దక్కింది. ఇక వెన్నెల గెలుపు కోసం కృషి చేస్తామని గద్దర్ అభిమానులు చెబుతున్నారు.