Begin typing your search above and press return to search.

మరో తొమ్మిది స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఖరారు!

రానున్న ఎన్నికల్లో టీడీపీ - బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన.. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానలను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 March 2024 4:33 AM GMT
మరో తొమ్మిది స్థానాల్లో  జనసేన అభ్యర్థులు ఖరారు!
X

రానున్న ఎన్నికల్లో టీడీపీ - బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన.. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీట్ల సార్దుబాటుకు సంబంధించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముందుగా ఐదుగురు అభ్యర్థులను ప్రకటించిన జనసేనాని.. అనంతరం కందుల దుర్గేష్ కు నిడదవోలు కేటాయించారు! అలా ఆరుగురు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరొ 9 పేర్లను కన్ ఫాం చేసినట్లు తెలుస్తుంది.

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీలూ దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 94 మంది అభ్యర్థులను ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇదే సమయంలో ఇప్పటికే 12 విడతల్లో సుమారు 70కి పైగా అభ్యర్థులను అసెంబ్లీకి, 23 మంది అభ్యర్థులను లోక్ సభ కు కేటాయించిన జగన్... ఈ నెల 16న ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వేదికగా మొత్తం అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా పార్టీ అభ్యర్థులు, నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని వారికి దిశానిర్ధేశం చేశారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులతో పాటు.. మరికొంతమంది నేతలతోనూ ఆయన మంగళగిరి ఆఫీసులో ముఖాముఖీ చర్చించారు. ఈ సందర్భంగా ఆ భేటీకి హాజరైన వారే అభ్యర్థులు అని తెలుస్తుంది. ఇందులో భాగంగా మరో 9 పేర్లు తెరపైకి వస్తున్నాయి.

ఇందులో భాగంగా... ఇప్పటికే ప్రకటించిన ఆరుగురు అభ్యర్థులతో పాటు ఈ రోజు మరో తొమ్మిది మంది అభ్యర్థులను జనసేనాని ప్రకటించనున్నారని తెలుస్తుంది. వారి వివరాలు ఇలా ఉన్నాయని అంటున్నారు.

పెందుర్తి - పంచకర్ల రమేష్

ఎలమంచిలి – విజయ్ కుమార్

విశాఖ సౌత్ - వంశీకృష్ణ యాదవ్

తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్

ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు

నరసాపురం - బొమ్మిడి నాయకర్

భీమవరం - రామాంజనేయులు

రాజోలు - దేవ వరప్రసాద్

తిరుపతి - ఆరణి శ్రీనివాసుల అభ్యర్థిత్వాలను జనసేనాని కన్ ఫాం చేశారని.. అన్నీ అనుకూలంగా జరిగితే ఈ రోజు అధికారిక ప్రకటన ఉండొచ్చని సమాచారం.