Begin typing your search above and press return to search.

ఏడాది పాల‌న‌: జ‌న‌సేన ఎమ్మెల్యేల గ్రాఫ్ ఎలా ఉంది..?

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏడాది పాలన పూర్త‌యింది. ఈఏడాది కాలంలో ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టు కుంది.. అధికంగా అంచ‌నాలు వేసుకున్న‌ది.. ఉన్న‌ది కూడా

By:  Tupaki Desk   |   10 Jun 2025 8:30 PM
ఏడాది పాల‌న‌: జ‌న‌సేన ఎమ్మెల్యేల గ్రాఫ్ ఎలా ఉంది..?
X

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏడాది పాలన పూర్త‌యింది. ఈఏడాది కాలంలో ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టు కుంది.. అధికంగా అంచ‌నాలు వేసుకున్న‌ది.. ఉన్న‌ది కూడా. జ‌న‌సేన ఎమ్మెల్యేల‌పైనే. ఇప్పుడంటే కూట‌మి పెట్టుకున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిన‌ట్టుగా మ‌రో 15 ఏళ్ల పాటు కూట‌మిగానే ఉండ‌నున్నారు. అయితే.. ఆ త‌ర్వాత‌.. ఒంట‌రి పోరు ఖాయ‌మే క‌దా?! అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఇది నిర్ణ‌యించే అవ‌కాశం ఉంటుంది. అయితే.. ఇలా చేయ‌డానికి.. నాయ‌కుల ప‌నితీరు కీలకం.

పార్టీల‌కు నాయ‌కులు కీల‌కం. అదేవిధంగా క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యేల ప‌నితీరు కూడా ముఖ్యం. ఈ ప‌రంగా తీసుకున్న‌ప్పుడు.. జ‌న‌సేన‌కు ఉన్న 21 మంది ఎమ్మెల్యేల ప‌నితీరు ఎలా ఉంది? అనేది అత్యంత ఆస‌క్తిక‌రం. వీరిలో ముగ్గురు మంత్రులు కాగా.. ఈ ముగ్గురిలోనూ ఒక‌రు ఉప ముఖ్య‌మంత్రి. వీరిని ప‌క్క‌న పెడితే.. మిగిలిన 18 మంది ఎమ్మెల్యేల ప‌నితీరుపై అటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా నివేదిక‌లు తెప్పించుకునే ప‌నిలో ప‌డ్డారు. స‌ర్వేలు చేయిస్తున్నారు.

ఇక‌, వ్య‌క్తిగ‌తంగా తీసుకుంటే.. 18 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రం వివాదాల‌కు కేంద్రం గా ఉన్నారు. మిగిలిన 12 మందిలో ఆరుగురు అస‌లు ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంటున్నారు. ఇక‌, ఇత‌ర నేత‌లు అడ‌పాద‌డ‌పా మాత్ర‌మే ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుంటున్నారు. సో.. ఏడాది పూర్త‌యినా.. ప్ర‌జ‌ల‌కు చేరువ కాలేని ఎమ్మెల్యేలు త‌మ ప‌నితీరు మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది సొంత పార్టీనే చెబుతున్న మాట‌.