Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్... వైరల్ అవుతున్న "జై లవకుశ" డైలాగ్!

ఈ సందర్భంగా వారి అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంట‌నే తొలగించాలని బాల‌కృష్ణ హుకుం జారీ చేశారు.

By:  Tupaki Desk   |   18 Jan 2024 2:53 PM GMT
హాట్  టాపిక్... వైరల్  అవుతున్న జై లవకుశ డైలాగ్!
X

దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 28వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌ కు అవమానం జరిగిందంటూ ఫ్యాన్స్ ఫైరవుతున్న సంగతి తెలిసిందే. నేడు వేకువజామునే జూ. ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌ లు ఎన్టీఆర్‌ కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంట‌నే తొలగించాలని బాల‌కృష్ణ హుకుం జారీ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలా సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తుంది. ఇప్పటికే "అసలు వారసుడు వద్దు.. కొసరు వారసులు ముద్దు" అంటూ నెట్టింట పోస్టులు పెడుతూ ఎద్దేవా చేస్తున్నారు. ఇదే సమయంలో.. “అసలు సిసలు వారసుడిని దూరం పెట్టి, విలువలు లేని వారంతా ఏకమవుతున్నారంటూ” దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ సమయంలో నెట్టింట ఒక హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్న ఫ్యాన్స్... ఈ సందర్భంగా "జై లవకుశ" సినిమాలోని డైలాగ్ ను షేర్ చేస్తున్నారు.

అవును... ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఆయన సరైన వారసుడిగా చెప్పే జూనియర్ ఎన్టీఆర్ కి అవమానం జరిగిందంటూ ఆయన ఫ్యాన్స్ నిప్పులు కక్కుతున్నారు. ఇందులో భాగంగా బాలకృష్ణపై ఫైరవుతున్నారు. “రక్తసంబందీకులు దూరం పెట్టినా.. బందువులు బాదపెట్టినా... తారక్ కు తామున్నామంటూ” అభిమానులు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా... "# వియ్ స్టాండ్ విత్ ఎన్టీఆర్" అనే హ్యాష్‌ ట్యాగ్‌ ను వైరల్ చేస్తున్నారు. ఇదే సమయంలో "మనం అనేది అబద్ధం" అనే డైలాగును షేర్ చేస్తున్నారు.

"జై లవకుశ" సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ ఎంత ఫేమస్ అనేది తెలిసిన విషయమే. ఈ సమయంలో... "మనం అనేది అబద్ధం.. నేను అనేది నిజం. ప్రేమను పగగా మార్చింది మీరే.. మీలో ఒక్కడిగా గుర్తిస్తారని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను" అంటూ జూనియర్ చెప్పే డైలాగ్ ను ఆయన అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. గతంలో తారక్‌ ను ఎడాపెడా వాడేసుకున్నారంటూ బాబు అండ్ కో పై తారక్‌ ఫ్యాన్స్‌ విరుచుకుపడపుతున్నారు.