Begin typing your search above and press return to search.

మేనల్లుడి కోసం హైదరాబాద్ కు జగన్... షెడ్యూల్ ఇదే!

ఇందులో భాగంగా ఇప్పటికె తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో తన మేనల్లుడి నిశ్చితార్ధానికి జగన్ హాజరుకానున్నారు.

By:  Tupaki Desk   |   18 Jan 2024 5:06 AM GMT
మేనల్లుడి కోసం హైదరాబాద్  కు జగన్... షెడ్యూల్  ఇదే!
X

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురి కుమారుడు రాజారెడ్డి వివాహం కన్ ఫాం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల ఈ వేడుకకు అతిథులను ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికె తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో తన మేనల్లుడి నిశ్చితార్ధానికి జగన్ హాజరుకానున్నారు.

అవును... తన మేనల్లుడు రాజారెడ్డి నిశ్చితార్ధానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఈ క్రమంలో నేడు హైదరాబాద్‌ వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ఆయన... ఈ సాయంత్రం 6:15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్‌ చేరుకుంటారు వైఎస్ జగన్.

అక్కడ జరగనున్న రాజారెడ్డి, ప్రియ నిశ్చితార్థ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం హైదరాబాద్ నుంచి బయలుదేరి.. రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్సయ్యింది. దీంతో ఈ వేడుకకు జగన్ రాక ఆసక్తికరంగా మారింది.

గోల్కొండ రిసార్ట్స్ లో వేడుక:

వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో ఈ రోజు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌ లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు షర్మిల పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నాయకులను ఆహ్వానించారు. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు చంద్రబాబు, పవన్ లను ఆహ్వానించారు.

కాగా... వైఎస్ షర్మిళ కుమారుడు రాజారెడ్డి ఇటీవలే అమెరికాలోని డల్లాస్ లో అప్లైడ్‌ ఎకనామిక్స్‌ & ప్రిడిక్టివ్‌ అనలటిక్స్‌ లో యూనివ‌ర్సిటీ నుంచి ప‌ట్టా అందుకున్నారు. ఇదే సమయంలో అమెరికాలోనే చదువుతున్న ప్రియ అట్లూరితో గత నాలుగేళ్లుగా పరిచయం ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలో... ఇవ్వాళ గండిపేటలో వీరి నిశ్చితార్థం జరగనుండగా... ఫిబ్రవరి 17న వీరిద్దరి వివాహం జరగనుంది!