Begin typing your search above and press return to search.

తొలి సంత‌కం ఆ ఫైలుపైనే: సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిర్వ‌హించిన ''మేమంతా సిద్ధం'' స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు.

By:  Tupaki Desk   |   4 April 2024 3:51 PM GMT
తొలి సంత‌కం ఆ ఫైలుపైనే:  సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

''కొంచెం ఓపిక పట్టండి.. జూన్‌ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. తొలి సంత‌కం వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన ఫైలు పైనే ఉంటుంది''- అని సీఎం జ‌గ‌న్ భ‌రోసా వ్య‌క్తం చేశారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చెబితే ఒక్క సంక్షేమ పథకం ఎవరికైనా గుర్తొస్తుందా? అని ప్రశ్నించా రు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిర్వ‌హించిన ''మేమంతా సిద్ధం'' స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు.

'మరో 5 వారాల్లో ఎన్నికలనే మహా సంగ్రామం జరగనుంది. ప్రతీ వర్గానికి మంచి చేసే మనం.. మోసం చేసే చంద్రబాబు కూటమి తలపడుతున్నాం. ఇవి ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. పేద, సామాజిక వర్గ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. మీ ఓటు మన తలరాతను, మన భవిష్యత్తును మారుస్తుంది. రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు. జూన్ 4 వరకూ ఓపిక పట్టండి. మళ్లీ మీ అందరి ప్రభుత్వం రాబోతుంది. అధికారంలోకి రాగానే తొలి సంతకం వ‌లంటీర్ వ్యవస్థపైనే ఉంటుంది. పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తాం' అని జగన్ స్పష్టం చేశారు.

కొంచెం ఓపిక పట్టండి.. జూన్‌ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. 'ఈ ఎన్నికలు పేదల అనుకూల భావజాలం, పెత్తందారుల అనుకూల భావజాలానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ. రాష్ట్రంలో అన్ని వర్గాలకు మంచి చేశాం. అన్ని సామాజిక వర్గాలకు డీబీటీ ద్వారా నేరుగా అకౌంట్లలో నగదు జమ చేసి లబ్ధి అందించాం. దశల వారీగా పెన్షన్లను రూ.3 వేలకు పెంచుకుంటూ వచ్చాం. వాలంటీర్ల ద్వారా ఒకటో తేదీనే ఇంటింటికీ పెన్షన్లు అందించాం. అలాంటిది తన మనిషితో ఫిర్యాదు చేయించి పెన్షన్ల పంపిణీని చంద్రబాబు అడ్డుకున్నారు'' అని అన్నారు.

''చంద్రబాబు దుర్మార్గం వల్లే 31 మంది అవ్వా తాతలు ప్రాణాలు కోల్పోయారు. పేదలకు ఇళ్ల పట్టాలు అందవద్దని కోర్టులకు వెళ్లారు. వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మనకు కోట్ల మంది అభిమానం ఉంటే.. ఎల్లో ముఠాకు పొరుగు రాష్ట్రం నుంచి అభిమానులు ఉన్నారు. నా వెంట నా తోబుట్టువులు ఉన్నారు. మనసారా ఆశీర్వదించే పేద అవ్వాతాతలు ఉన్నారు. జగన్ మామ అని పిలిచే చిన్నారులు ఉన్నారు. పేదల భవిష్యత్తు మార్చేలా 58 నెలలుగా అడుగులు పడ్డాయి' అని సీఎం జగన్ పేర్కొన్నారు.