హీట్ పాలిటిక్స్ మధ్య ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్న జగన్...!
ఏపీకి రావాల్సిన వాటిని సాధించేందుకు మరోసారి కేంద్ర పెద్దల వద్ద చర్చలు జరిపి నిధులు వీలైనంతవరకూ తీసుకుని వచ్చేందుకు ఎన్నికల ముందు చేసే చివరి ప్రయత్నం అని అంటున్నారు.
By: Tupaki Desk | 2 March 2024 9:13 AM ISTముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకటి రెండు రోజులలో ఢిల్లీకి వెళ్తారు అన్న వార్తలు చక్కలు కొడుతున్నాయి. ఆయన ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దలను కలుస్తారు అన్నది ఆ వార్త సారాంశం. జగన్ ఢిల్లీ టూర్ అఫీషియల్ అని అంటున్నారు. ఏపీకి రావాల్సిన వాటిని సాధించేందుకు మరోసారి కేంద్ర పెద్దల వద్ద చర్చలు జరిపి నిధులు వీలైనంతవరకూ తీసుకుని వచ్చేందుకు ఎన్నికల ముందు చేసే చివరి ప్రయత్నం అని అంటున్నారు.
జగన్ ఢిల్లీ టూర్ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు కన్ ఫర్మ్ చేశాయి. జగన్ ఢిల్లీ టూర్ లో ఎవరెవరిని కలుస్తారు అన్నది కూడా ఆసక్తికరమైన చర్చగానే ఉంది. ఆయన మరోసారి ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారు అని అంటున్నారు. ఈసారి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలుస్తారు అని అంటున్నారు. ఈ ఇద్దరితో జగన్ కేవలం అఫీషియల్ భేటీలే వేయరని పొలిటికల్ గా కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇక ఏపీలో చూస్తే పొత్తుల కధ ఇంకా కొలిక్కి రాలేదు, బీజేపీ టీడీపీల మధ్య చర్చలు సాగుతూనే ఉన్నాయి. మార్చి మొదటి వారంలో రావచ్చు అన్నది ఒక మాటగా ఉంది. ఈ నేపధ్యంలో సడెన్ గా జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకోవడంతో ప్రతిపక్ష శిబిరం కూడా అలెర్ట్ అయి ఏమి జరుగుతోంది అని చూస్తోంది.
కేంద్రంలోని బీజేపీ అయితే అటు వైసీపీతోనూ ఇటు టీడీపీతోనూ గుడ్ రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేస్తోంది అని అంటున్నారు. సేఫ్ గేమ్ కమలనాధులు ఆడుతున్నారు అని అంటున్నారు. జగన్ కోరినప్పుడల్లా కేంద్ర పెద్దలు ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు గత నెల మొదటి వారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపిన వెంటనే జగన్ ని పిలిపించుకుని మరీ చర్చలు జరిపారు.
దీని భావం తెలియక విపక్ష శిబిరం కూడా అయోమయానికి గురి అవుతోంది. ఇపుడు మళ్ళీ కూటమి కట్టే చివరి దశలో జగన్ ఢిల్లీ టూర్ ఎందుకు అన్నది రాజకీయంగా వినిపిస్తున్న మాట. ఇంకో వైపు చూస్తే కూటమిలో బీజేపీ చేరినా వైసీపీని దూరం చేసుకోదు అన్న మాట కూడా ఉంది.
ఏది ఏమైనా మరి కొద్ది రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తోంది. ఈ నేపధ్యంలో జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు అన్నది మాత్రం పూర్తి సస్పెన్స్ గానే ఉంది. రాజకీయంగా ఇది విపరీతమైన చర్చకు సైతం తావు ఇస్తోంది. జగన్ ఢిల్లీ టూర్ తరువాతనో ముందో పొత్తులు కుదురుతాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ ఢిల్లీ టూర్ తరువాత ఏపీ పాలిటిక్స్ లో మరిన్ని సంచలన పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
