Begin typing your search above and press return to search.

జగన్ కే ఎలా వస్తాయి ఈ ఆలోచనలు... సురక్ష సూపర్ హిట్!

గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టని ఓ అద్భుత కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని జగన్ భావించినట్లున్నారు

By:  Tupaki Desk   |   4 Aug 2023 9:52 AM GMT
జగన్  కే ఎలా వస్తాయి ఈ ఆలోచనలు... సురక్ష సూపర్  హిట్!
X

పాదయాత్ర పుణ్యమో.. లేక, కుటుంబ నేపథ్యమో తెలియదు కానీ... కామన్ మేన్ కష్టాల విషయంలో జగన్ కు పరిపూర్ణమైన అవగాహన ఉందని అంటుంటారు కొంతమంది రాజకీయ పండితులు. కామన్ మేన్ చెప్పుకో లేని చిన్న చిన్న విషయాలను జగన్ గ్రహిస్తుంటారని.. ఆయన తీసుకునే నిర్ణయాలు చెబుతుంటాయని అంటున్నారు. ఈ సమయంలోనే సురక్ష తెరపైకి వచ్చింది.

గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టని ఓ అద్భుత కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని జగన్ భావించినట్లున్నారు. ఇందులో భాగంగా... ప్రభుత్వ సేవలు మరింత సులభతరం కావాలని చేసిన ఓ ప్రత్యేక ప్రయత్నం నెలపాటు కొనసాగి ఈమధ్యే ముగిసింది. తాజాగా ఈ కార్యక్రమం సక్సెస్ విషయాలు హల్ చల్ చేస్తున్నాయి.

అవును... ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్వహించిన కార్యక్రమం "జగనన్న సురక్ష"! ఈ ప్రత్యేక కార్యక్రమం జులై 1 నుంచి 31 వరకు నెలరోజులపాటు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది వాలంటీర్లు.. సచివాలయ, రెవెన్యూ సిబ్బంది స్వయంగా పాల్గొన్నారు. ప్రతి కుటుంబాన్ని పలకరించి, వారికి ప్రభుత్వంతో ఉన్న పనుల అవసరాలు తెలుసుకున్నారు.

ప్రజల అవసరాలను తెలుసుకున్న అనంతరం వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజల ముంగిటకు ప్రభుత్వాన్ని తీసుకువచ్చే ఈ ప్రత్యేక కార్యక్రమం నాలుగు రోజుల క్రితం ముగిసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15,004 గ్రామా సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు.

విద్య సంవత్సరం ప్రారంభం అయిన నేపథ్యంలో విద్యార్థులకు అవసరం అయ్యే కులం, ఆదాయం, నివాసం వంటి పలు ధ్రువీకరణ పత్రాలకు అక్కడే దరఖాస్తులు స్వీకరించడం.. వెనువెంటనే వాటిని మంజూరు చేయడం వంటి ప్రక్రియ నిర్వహించింది జగన్ సర్కార్. దీని ద్వారా ప్రజలకు డబ్బు, సమయం అదా అయ్యింది.


గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కలిసి ఈ క్రమంలో 93,57,707 సర్టిఫికెట్స్ మంజూరు చేసారు. దాదాపు 5.3 కోట్ల మందికి చేరువయ్యేలా చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో 1,46,27,905 కుటుంబాలను కలిసి దాదాపు 11 రకాల సర్టిఫికెట్లు.. రేషన్ కార్డుల్లో మార్పులు వంటివి చేపట్టి అక్కడికక్కడే మంజూరు చేశారు.

గత్రంలో సర్టిఫికెట్ అంటేనే ఓ పెద్ద ప్రయాస:

వైస్ జగన్ సీఎం అయిన అనంతరం ఇలా సర్టిఫికెట్లు సులువుగా వస్తున్నాయి కానీ.. ఐదేళ్ల క్రిందట అయితే విద్యార్థులకు ఈ సర్టిఫికెట్స్ తీసుకోవడం ఒక పెద్ద ప్రయాస అయ్యేది. మండలాఫీసుకు వెళ్లడం, బయట ఒక బ్రోకర్ ని పట్టుకోవడం.. వాడి చెయ్యి తడపడం.. వారంంలో అయిపోద్దని చెప్పడం.. నెలల తరబడి తిరగడం వంటివి గతంలో ఉండేవని అంటున్నారు.

విద్య సంవత్సరం ప్రారంభంలో కాలేజీలు, యూనివర్సిటీలు, హాస్టల్ లలో చేరడం.. రిజర్వేషన్ కోటాలో ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, ఎంబీఏ వంటి కోర్సుల్లో చేరడం కూడా ఈ రెండు మూడు నెలల్లోనే ఉంటుంది. దీంతో... లక్షలాది మంది విద్యార్థులు ఆయా మండల కార్యాలయాలకు వెళ్లి లేదా ఈసేవలో దరఖాస్తు చేసుకుని అవి మళ్ళీ వచ్చేవరకూ ఎదురుచూపులు ఉండేవి.

సర్టిఫికెట్ ఉంటే రిజర్వేషన్ కోటాలో సీటు, హాస్టల్ వసతి వంటివి వస్తాయి. అవి సరైన రోజుకు సమర్పించకపోతే సీటు పోతుంది.. ఛాన్స్ పోతుంది. ఒకేసారి వందలాది సర్టిఫికెట్స్ ఇవ్వడం కూడా మండల స్థాయి అధికారులకు కష్టమే అయ్యేది. ఇప్పుడు ఈ "జగనన్న సురక్ష"కార్యక్రమంలో లక్షలాది మంది విద్యార్థులకు వెనువెంటనే సర్టిఫికెట్స్ ఇచ్చి వారికి పనులు సులభతరం చేసారు. దీంతో... "జయహో జగనన్న" అని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.