జగన్ వర్సెస్ బాబు.. ఈ మార్పే కావాల్సింది.. !
రాజకీయాల్లో నాయకుల మధ్య తేడాలు ఉండచ్చు. పార్టీల సిద్ధాంతాలు కూడా తేడా ఉండొచ్చు. దీనిని ఎవరూ కాదనరు. నిజానికి ఇలా తేడా లేకపోతే.. ఇబ్బందే.
By: Tupaki Desk | 19 May 2025 11:30 AMరాజకీయాల్లో నాయకుల మధ్య తేడాలు ఉండచ్చు. పార్టీల సిద్ధాంతాలు కూడా తేడా ఉండొచ్చు. దీనిని ఎవరూ కాదనరు. నిజానికి ఇలా తేడా లేకపోతే.. ఇబ్బందే. ఎవరి విధానం వారిదే. అయితే.. అంతిమంగా క్షేత్రస్థాయిలో ప్రజల విధానం అందరికీ అవసరం. ఈ పరంగా చూసుకుంటే.. జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. తొలి మూడేళ్లు.. ఆయన సాగించిన పాలనకు మంచి మార్కులు పడ్డాయి. కరోనాతో రెండేళ్లు పోయినా.. తర్వాత ఏడాది సంక్షేమం తదితరాలతో ఆకట్టుకున్నారు.
ఇక, సోషల్ ఇంజనీరింగ్ ద్వారా చేపట్టిన మార్పులు, చేసిన సంస్కరణలు మరింతగా జగన్కు పేరు తెచ్చాయి. కానీ.. చివరి ఏడాదిన్నర సమయంలో ప్రజల మధ్య వచ్చిన వ్యతిరేకతను అంచనా వేయడంలో జగన్ విఫలమయ్యారు. డబ్బులు ఇస్తున్నాం.. కాబట్టి ప్రజలు తనతోనే ఉంటారని ఎక్కువగా అంచనా వేసుకున్నారు. కానీ, ఇది పూర్తిగా విఫలమైంది. అంతేకాదు.. పోలీసులు వ్యవహరించిన తీరు.. వ్యవస్థల పతనం వంటివి కూడా ప్రమాదకరంగా మారాయి.
కట్ చేస్తే.. 151 సీట్ల నుంచి 11 స్థానాలకు వైసీపీ పరిమితం అయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలన కు వస్తే.. చంద్రబాబు పాలనకు 11 మాసాలు పూర్తయ్యాయి. అయితే..అభివృద్ది మంత్రంతో ఇప్పటి వరకు ఆయన ముందుకు సాగారు. మరో నాలుగేళ్ల సమయం ఉంది. కానీ.. వాస్తవానికి ప్రజల అసంతృప్తిని పరిగణనలోకి తీసుకుంటే.. ప్రధాన సామాజిక వర్గాలు.. ఓటు బ్యాంకును చూసుకుంటే.. వారిలో అసంతృప్తి ప్రారంభమైంది. దీనిని సీఎం గుర్తించాల్సి ఉంది.
అదే సమయంలో వ్యవస్థల పతనం.. కామన్గానే మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా.. చేతులు తడపందే పనులు కావడం లేదు. పోలీసు వ్యవస్థపై ఒత్తిడి పెరిగి.. రాజకీయ ప్రాధాన్యానికి ఇస్తున్న ఇంపార్టెన్స్.. సామాన్యుల గోడుకు ఇవ్వడం లేదన్న కామెంట్లు జోరుగా వినిపిస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ఇది.. 11 నెలల మార్కు ఫలితమే. కాబట్టి..ఈ వ్యవస్థలను జాగ్రత్తగా కాచుకోకపోతే.. ఇబ్బందులు తప్పవనేది మేధావుల సూచన. మరి ఏం చేస్తారో చూడాలి.