Begin typing your search above and press return to search.

జగన్ వర్క్ ఫ్రం హోం అయితే...పవన్ సినిమా షూటింగ్ ఏమి వర్క్ అంటారు ?

ఎన్నికలు దగ్గరపడ్డాక కానీ వారు ఏపీలో పూర్తిగా ఫీల్డ్ లోకి దిగలేదు అని చెబుతారు. కట్ చేస్తే ఇపుడు జగన్ కూడా అదే చేస్తున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   5 May 2025 8:06 AM
జగన్ వర్క్ ఫ్రం హోం అయితే...పవన్ సినిమా షూటింగ్ ఏమి వర్క్ అంటారు ?
X

రాజకీయాల్లో విమర్శలు చేయడం సులువు. కానీ అవే తిరిగి వెనక్కి వచ్చి అన్న వారినే తగులుకుంటాయని ఎవరూ గ్రహించలేరు. గతంలో వైసీపీ నేతలు బాబు, పవన్ లను హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే పొలిటికల్ టూరిస్టులు అని సెటైర్లు వేసేవారు. ఆనాడు బాబు పవన్ హైదరాబాద్ నుంచే రాజకీయం చేస్తూ వచ్చారు.

ఎన్నికలు దగ్గరపడ్డాక కానీ వారు ఏపీలో పూర్తిగా ఫీల్డ్ లోకి దిగలేదు అని చెబుతారు. కట్ చేస్తే ఇపుడు జగన్ కూడా అదే చేస్తున్నారు అని అంటున్నారు. కాకపోతే ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లికి షటిల్ సర్వీస్ చేస్తున్నారు. వారంలో నాలుగు రోజులు తాడేపల్లిలో ఉండే జగన్ గురువారం సాయంత్రం అవుతూనే బెంగళూరు కోసం ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. పునఃదర్శనం సోమవారం గానే ఉంటోంది.

సరే జగన్ ఓడిపోయారు. 11 సీట్లకే పరిమితం అయ్యారు. ఓడిపోయిన బాధలో ఆయన ఉన్నారు అని సరిపెట్టుకుంటున్నారు. పైగా విపక్షంలో ఆయన చేయాల్సింది ఈ రోజుకు అయితే పెద్దగా లేదని సరైన సమయంలో ఆయన ఫీల్డ్ లోకి వస్తారు అని వైసీపీ నేతలు అంటున్నారు కానీ కూటమి నేతలు అసలు ఊరుకోవడం లేదు.

జగన్ తన ట్విట్టర్ కి పనిచెబుతూంటే మీడియా మీటింగులలో కూటమి నేతలు జగన్ కి గట్టిగా కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. ఆయనకు కొత్త పేరు పెట్టి మరీ పొలిటికల్ ర్యాగింగ్ చేస్తునారు. జగన్ సీఎం గా ఉన్నపుడు చంద్రబాబు పవన్ పొలిటికల్ టూరిస్టులు అయితే జగన్ ది వర్క్ ఫ్రం బెంగళూరు గా అయిందట.

ఈ విధంగా మంత్రి జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ జగన్ ని టార్గెట్ చేస్తూ వర్క్ ఫ్రం బెంగళూరు కి ఏపీతో పనేముందని అన్నారు. ఆయనకు ఏపీలో సమస్యలు ఏ విధంగా అర్ధం అవుతాయని కూడా ప్రశ్నించారు. ఏపీలో రైతుల గురించి కానీ వారి సమస్యల మీద కానీ జగన్ కి కనీసంగా కూడా అవగాహన లేదని ఆయన గట్టిగానే విమర్శలు చేశారు.

ఇక వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసి ఏకంగా 1674 కోట్ల రూపాయలు బాకీ పెట్టేసిందని ఇపుడు మాత్రం రైతుల మీద ఉత్త ప్రేమను ఒలకబోస్తోంది అని నాదెండ్ల విమర్శించారు. అన్న దాతలను వేధించిన ఘనత వైసీపీదే అని ఆయన ఫైర్ అయ్యారు.

అయితే కూటమి ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలో ఇప్పటిదాకా 11 వేల కోట్ల రూపాయలు నగదు వేసిందని గుర్తు చేశారు. నాదెండ్ల విమర్శలు వరకూ ఓకే అయినా వర్క్ ఫ్రం బెంగళూర్ అని కొత్త ట్యాగ్ తగిలించి జగన్ మీద విరుచుకు పడటం మీద వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

జగన్ కి అధికారం లేదని ఆయన పదవిలో ఉన్నపుడు తాడేపల్లి విడిచి ఒక్క రోజు ఎక్కడా లేరని వీకెండ్స్ అంటూ హైదరాబాద్ కి ఫ్లైట్ ఎక్కి వెళ్ళలేదని గుర్తు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి సినిమా షూటింగులు చేస్తున్నారని మరి ఆ వర్క్ ని ఏమంటారు అని నాదెండ్లను నిలదీస్తున్నారు.

బాధ్యత గల పదవిలో ఉన్న వారు దానిని పక్కన పెట్టి వేరే వర్క్ లో ఉండడం భావ్యమా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ సీఎం గా ఉన్నపుడు అలా ఎపుడాఇనా చేశారా అని అడుగుతున్నారు. దాంతో నాదెండ్ల జగన్ కి ఒకటి అని పవన్ కి నాలుగు అంటించినట్లు అయింది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగులు గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారు అని కూటమిలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

దాంతో పవన్ వర్క్ ఫ్రం సినిమా షూటింగులా అని వైసీపీ నేతలు తగులుకుంటున్నారు. మొత్తానికి నాయకులు వారూ వీరూ అని కాదు అధికార పార్టీనా లేక ప్రతిపక్ష పార్టీనా అంతకంటే కాదు, ఎవరూ ఏపీలో ఉండేందుకు ఇష్టపడలేదు అన్నది వాస్తవం అని జనాలు అంటున్నారు

మాజీలు తాజాలు ప్రజా ప్రతినిధులు అందరి ఇళ్ళూ కేరాఫ్ హైదరాబాద్ అయినపుడు ఏవరొ ఒకరి మీదనే ఆరోపణలు విమర్శలు చేస్తూ కొత్త పేర్లు పెట్టడం ఎందుకు అన్న చర్చ సాగుతోంది. అందరూ ఆ తానులో ముక్కలే కాబట్టి గమ్మున ఉండడమే బెటర్ అని అంటున్నారు.