Begin typing your search above and press return to search.

జగన్ మీద అదే ర్యాగింగ్...వైసీపీ హర్ట్ !

ఆయన అధికారంలో ఉన్నపుడు సైకో అన్న వారే ఇపుడు టోన్ మార్చి పులివెందుల ఎమ్మెల్యే అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   9 April 2025 4:28 PM
జగన్ మీద అదే ర్యాగింగ్...వైసీపీ హర్ట్ !
X

వైసీపీ అధినేత మాజీ సీఎం మీద టీడీపీ పొలిటికల్ ర్యాగింగ్ మామూలుగా ఉండదు. ఆయన అధికారంలో ఉన్నపుడు సైకో అన్న వారే ఇపుడు టోన్ మార్చి పులివెందుల ఎమ్మెల్యే అని అంటున్నారు. జగన్ జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే అని మంత్రుల నుంచి ఎమ్మెల్యే దాకా అదే మాట అంటున్నారు. కేవలం టీడీపీ మాత్రమే కాదు కూటమిలోని ఇతర పార్టీల నేతలు కూడా అలాగే మాట్లాడుతున్నారు.

ఒక విధంగా వైసీపీ నాయకత్వాన్ని డీమోరలీజ్ చేయడానికే ఇలా చేస్తున్నారని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడచింది తొలి రోజు నుంచి ఇదే విధంగా కామెంట్స్ చేయడంతో వైసీపీ హర్ట్ అవుతోంది. అయితే మొదట్లో వైసీపీ దీనిని పెద్దగా పట్టించుకోలేదు.

కానీ రాను రానూ ఈ ర్యాగింగ్ ఎక్కువైపోతోంది దాంతో వైసీపీ హర్ట్ అవుతోంది నిజానికి చూస్తే ఇదంతా వైసీపీ కోరి చేసుకున్నదే అని కూడా అంటున్నారు. అసెంబ్లీకి జగన్ రాకుండా విపక్ష హోదా కోరడంతోనే అసలు వ్యవహారం స్టార్ట్ అయింది. అసెంబ్లీలో 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే విపక్షం హోదా ఇస్తారు అన్నది ఆనవాయితీగా ఉంది. దాంతో వైసీపీకి ఆ హోదా రాదు అని కూటమి ప్రభుత్వం చెబుతూ వచ్చింది ఆ సమయంలోనే జగన్ కూడా ఒక ఎమ్మెల్యేనే అని స్పష్టీకరణ చేసింది.

అయితే జగన్ కానీ ఆ విధంగా పట్టుబట్టి ఉండకపోయి ఉంటే ఆయనను ప్రతిపక్ష నేతగానే చూసేవారు. 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో వైసీపీ పక్ష నేతగా జగన్ కి ఆ గౌరవం ఉండేది అని అంటున్నారు కనీసం ఆయనను వైసీపీ పక్ష నేత అని అయినా సంబోధించేవారు. హోదా కోసం వైసీపీ పట్టుబట్టిందా లేక వ్యూహం రచించిందా తెలియదు కానీ జగన్ జస్ట్ ఎమ్మెల్యే అన్న ట్యాగ్ ని మాత్రం దక్కించుకునేలా చేసుకుంది అని అంటున్నారు

ఇదిలా ఉంటే రాపర్తిలో జగన్ కి భద్రత సరిగ్గా కల్పించలేదు అన్న దాని మీద హోం మంత్రి అనిత మాట్లాడుతూ జగన్ పులివెందుల ఎమ్మెల్యే ఆయనకు వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఇస్తే సరిపోతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా తాము 1100 మంది పోలీసులతో బందోబస్తు ఇచ్చామని చెప్పారు. జగన్ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలను వైసీపీ కీలక నాయకుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి తప్పు పట్టారు. జగన్ ని పట్టుకుని పులివెందుల ఎమ్మెల్యే అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన మాజీ ముఖ్యమంత్రి అని మరచిపోతున్నారు అని మండిపడ్డారు. జగన్ ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధినేతగా ప్రతిపక్ష నేతగా ఈ ప్రభుత్వం చూడడం లేదని ఆయన విమర్శించారు. జగన్ కి సరైన భద్రత కల్పించడం లేదని ఆయన పర్యటన గురించి ముందస్తుగా సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని కూడా ఆయన ఆరోపించారు.

జగన్ ని లేకుండా చేయాలని కుట్ర జరుగుతోందని కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్యాయంగా వ్యవహరించిన పోలీసుల గురించే జగన్ మాట్లాడారని నిజాయితీగా పనిచేసే పోలీసుల విషయంలో తాము ఎపుడూ సెల్యూట్ చేస్తామని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.

వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన 200 మంది పోలీసు అధికారులను కూటమి ప్రభుత్వం వీఆర్ లో పెట్టిందని దాని మీద కూడా పోలీసు సంఘాలు మాట్లాడాలని ఆయన కోరారు. మొత్తానికి చూస్తే జగన్ ని పట్టుకుని పులివెందుల ఎమ్మెల్యే అనడాన్ని మాత్రం ఆ పార్టీ తట్టుకోలేకపోతోంది హర్ట్ అవుతోంది అని అర్ధం అవుతోంది. మరి దీని మీద బాధపడటం కంటే ఏమి చేయాలో ఆ పార్టీ పెద్దలే ఆలోచించుకోవాలని అంటున్నారు.