నా దగ్గరేముంది...జగన్ కామెంట్స్ బూమరాంగేనా ?
గురువారం తన పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన దగ్గర డబ్బు ఏదీ లేదని సంచలన కామెంట్స్ చేశారు
By: Tupaki Desk | 22 May 2025 2:08 PMనా దగ్గర డబ్బు ఏముందని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. గురువారం తన పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన దగ్గర డబ్బు ఏదీ లేదని సంచలన కామెంట్స్ చేశారు. లిక్కర్ స్కాం మీద ఏపీలో రచ్చ అవుతున్న నేపధ్యంలో వైసీపీ కుంభకోణాల ద్వారా సొమ్ములు వేల కోట్లు వెనకేసిందని ఆరోపణలు వస్తున్న క్రమంలో మీడియా జగన్ ని దీని మీద ప్రశ్నించింది.
దాంతో తన దగ్గర కుంభకోణం డబ్బులు లేవు అని చెప్పబోయి జగన్ తమ దగ్గర ఏముంది అనేశారు. ఇంకా ముందుకెళ్ళి పార్టీ నడపడమే కష్టంగా ఉందని జగన్ అంటూ ఏకంగా పార్టీకే షాక్ ఇచ్చారు. దాంతో జగన్ కుంభకోణం గురించి గట్టిగా చెప్పాలని భావించి దూకుడుగా చేసిన ఈ వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయని అంటున్నారు.
నిజానికి వైసీపీని అవినీతి పార్టీ అని టీడీపీ సహా ఇతర ప్రత్యర్ధులు విమర్శించడం ఈ రోజుది కాదు 2012 నుంచి అవే ఆరోపణలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులలో జగన్ మీద కోర్టు విచారణ కూడా ఉంది. అయినా కూడా డబ్బులు లేవు పార్టీని నడపడానికి అని జగన్ ఏనాడూ అనలేదు. పైగా తన మీద వచ్చిన కేసుల గురించి కూడా ఆయన మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు.
కానీ ఏపీలో లిక్కర్ స్కాం సెగలు వైసీపీని బాగా తాకుతున్న నేపధ్యంలో ఈ కేసులో అరెస్టులు బిగ్ షాట్స్ దాకా వస్తున్న క్రమంలో ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సహజంగానే దాని మీదనే ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయి. వాటికి జవాబు ఇస్తూ వైసీపీ నిజాయతీగా పాలన చేసింది అని స్ట్రాంగ్ గా చెప్పే ప్రయత్నంలో జగన్ డబ్బులు అసలు పార్టీని నడపడానికే లేని అని కుండబద్ధలు కొట్టారు. అంతే కాదు నా దగ్గర డబ్బులు లేవు మీ దగ్గర ఉంటే ఇవ్వాలని అడడగం కూడా ఇంకా విశేషంగా ఉందని అంటున్నారు
ఏ పార్టీ అధినాయకత్వం కూడా ఈ విధంగా డబ్బులు లేవని బాహాటంగా చెప్పదు. తమ తంటాలేవో పడుతుంది. ఏపీలో అయిదేళ్ళ పాటు అధికారంలో ఉన్న పార్టీగా వైసీపీ దగ్గర డబ్బులు లేవని ఎవరూ అనుకోరు. ఇక జగన్ పారిశ్రామికవేత్త నుంచి రాజకీయ నాయకుడిగా టర్న్ అయిన వారు.
దాంతో పాటు పార్టీకి ఆర్ధికంగా వెన్ను దన్నుగా ఉండేవారు ఉన్నారనే భావిస్తారు. కానీ పార్టీ నడిపేందుకే డబ్బులు లేవని ఇంకా నాలుగేళ్ళు ప్రతిపక్షంలో ఉంటూ పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళాల్సిన వేళ జగన్ చేసిన ఈ కామెంట్స్ క్యాడర్ కి తప్పుడు సందేశం ఇస్తాయని అంటున్నారు.
అంతే కాదు వారు డీమోరలైజ్ అవుతారని అంటున్నారు. ఇప్పటికే వైసీపీ ఓటమి తరువాత భవిష్యత్తు ఆ పార్టీకి లేదని భావించే చాలా మంది తప్పుకున్నారు ఇపుడు పార్టీని నడపడం ఇబ్బందిగా ఉంది అని సాక్షాత్తు అధినాయకుడే అంటే ఇక పార్టీలో ఉండేవారు కూడా ఆలోచించుకుంటారు కదా అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే లిక్కర్ స్కాం విషయంలో మాట్లాడుతూ చంద్రబాబు దగ్గర డబ్బునా అని జగన్ మీడియాను ఎదురు ప్రశ్నించారు. అంటే మద్యం కుంభకోణం అంతా బాబు హయాంలోనే జరుగుతోందని ఆయన గట్టిగా చెప్పేందుకు చూశారు. అదంతా రాజకీయంగా ఆరోపణలకు బాగానే ఉన్నా పార్టీని నడపడం కష్టమని ఒక అధినేత అనడం మాత్రం రాంగ్ స్టేట్మెంట్ అని అంటున్నారు.
దాంతో వైసీపీకి జగన్ ప్రెస్ మీట్ వల్ల మైలేజ్ పెద్దగా లేకపోగా నష్టమే జరుగుతుంది అని అంటున్నారు. పార్టీలో ఈ రోజుకు 11 మంది ఉన్నారు. రేపటి రోజున లోకల్ బాడీ ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల దాకా పార్టీని నడపాలి అంటే ఇలా అయితే మహా యుద్ధంగా అంతా భావిచే 2029 ఎన్నికలను ఎలా వైసీపీ ఫేస్ చేస్తుంది అన్న డౌట్ వచ్చేలా మాత్రం జగన్ కామెంట్స్ ఉనాయని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ అధినేత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.