జగన్ అక్రమాస్తుల కేసు... తెరపైకి రూ.793 కోట్ల మేటర్!
అవును... జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ అస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది.
By: Tupaki Desk | 17 April 2025 12:03 PMవైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... దాల్మియా సిమెంట్స్ అస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. ఈ సందర్భంగా... రూ.793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అవును... జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ అస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. ఇందులో భాగంగా... రూ.793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. వాస్తవానికి కడప జిల్లాలోని 417 హెక్టార్ల సున్నపురాయి గనులను అప్పటి వైఎస్సార్ సర్కార్ దాల్మియా సిమెంట్స్ కు లీజుకిచ్చింది.
అయితే... ఈ విషయంలో జగన్ తో కలిసి దాల్మియా సిమెంట్స్ అక్రమంగా సున్నపురాయి గనుల లీజులు పొందినట్లు సీబీఐ 2013లోనే ఛార్జిషీట్ దాఖలు చేయగా.. ఈ 417 హెక్టార్ల సున్నపురాయి గనుల కేటాయింపులోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని సీబీఐ గతంలోనే ఆరోపించిన పరిస్థితి.
ఇందులో భాగంగా జగన్ కు సుమారు రూ.150 కోట్ల మేర లబ్ధి చేకూరినట్లు సీబీఐ పేర్కొంది. ఈ క్రమంలో ఛార్జిషీట్ ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టింది. ఈ సమయంలో తాజాగా రూ.793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
కాగా దేశంలో నాల్గవ అతి పెద్ద సిమెంట్ ఉత్పత్తి సంస్థ అయిన దాల్మియా భారత్ లిమిటెడ్.. 2025 ఆర్థిక సంవత్సరంలో 49.50 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించినట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
బీహార్ లోని రోహతాస్ సిమెంట్ వర్క్స్ ప్లాంట్ లో అదనంగా 0.5 మిలియన్ టన్నుల వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత ఈ లక్ష్యాన్ని సాధించిందని కంపెనీ ప్రకటించింది.