Begin typing your search above and press return to search.

పిఠాపురంలో 'జ‌బ‌ర్ద‌స్త్' ప్ర‌చారం

ఇప్ప‌టి వ‌రకు జ‌న‌సేన త‌ర‌ఫున అంతంత మాత్రంగానే ఉన్న ప్ర‌చారం.. తాజాగా గురువారం ఉదయం నుంచి జోరందుకుంది.

By:  Tupaki Desk   |   11 April 2024 6:30 PM GMT
పిఠాపురంలో జ‌బ‌ర్ద‌స్త్ ప్ర‌చారం
X

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురంలో వేడి రాజుకుంది. ఇప్ప‌టి వ‌రకు జ‌న‌సేన త‌ర‌ఫున అంతంత మాత్రంగానే ఉన్న ప్ర‌చారం.. తాజాగా గురువారం ఉదయం నుంచి జోరందుకుంది. దీనికి కార‌ణం.. జ‌బ‌ర్ద‌స్త్ టీం ఇక్క‌డ వాలిపోవ‌డ‌మే. ఓ ప్ర‌ముఖ చానెల్ లో ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మం ద్వారా సెల‌బ్రిటీలుగా మారిన హైప‌ర్ ఆది, గెట‌ప్ శ్రీనుల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ప్ర‌క‌టించారు.

వీరితో పాటు మ‌రికొంద‌రిని కూడా స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ప్ర‌క‌టించినా.. వారింకా రంగంలోకి దిగ‌లేదు. గు రువారం ఉద‌యం మాత్రం హైప‌ర్ ఆది, గెట‌ప్ శ్రీనులు బ‌రిలోకి దిగిపోయారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని పంచుకు న్నారు. పార్టీ అనుచ‌రులు, కార్య‌క‌ర్త‌లతో క‌లిసి ఇంటింటి ప్ర‌చారం చేశారు. జ‌న‌సేన‌ను ఎందుకు గెలిపిం చాలో వివ‌రించారు. ఇదే స‌మ‌యంలో వైసీపీపై క్యామెడీ పంచ్‌లు వేశారు. ప్ర‌చారంలో భాగంగా ప‌లు చోట్ల చిన్న‌పాటి స‌భ‌ల్లో నూ వీరు ప్ర‌సంగించారు.

దీంతో పిఠాపురంలో ప్ర‌చారం ఊపందుకుంది. మ‌రోవైపు.. టీడీపీ నేత వ‌ర్మ ఆయ‌న అనుచ‌రులు కూడా ఇంటింటికీ తిరుగుతున్నారు. వ‌ర్మ కుటుంబం మొత్తం పిఠాపురంలోనే ఉంటూ.. నిత్యం ప్ర‌జ‌ల‌తో ట‌చ్‌లో ఉంటోంది. ఇదేవిధంగా జ‌న‌సేన కీల‌క నాయ‌కులు మ‌రోవైపు స్ట్రాట‌జీని రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న షెడ్యూల్ ప్ర‌కారం.. మ‌రో 20 రోజుల వ‌రకు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించ‌నున్నారే త‌ప్ప‌.. పిఠాపురంలో షెడ్యూల్ లేదు. దీంతో స్టార్ క్యాంపెయిన‌ర్లే అన్నీతామై ఇక్క‌డ ప్ర‌చారం చేసేలా ప్ర‌ణాళిక రూపొందించారు. దీంతో రాబోయే 20 రోజుల్లో జ‌న‌సేన ప్ర‌చారం పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.