Begin typing your search above and press return to search.

స‌ర్దుకు పోతున్నా.. స‌మ‌స్య‌లే.. ఇక్క‌డ‌ ఇంతేనా...!

నాయ‌కులు స‌ర్దుకుపోతున్నా.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లా మాత్రం స‌మ‌స్య‌లు మాత్రం అలానే ఉంటు న్నాయి.

By:  Tupaki Desk   |   6 May 2025 7:30 PM
Internal Rift in Alliance Silent Power Struggles
X

నాయ‌కులు స‌ర్దుకుపోతున్నా.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లా మాత్రం స‌మ‌స్య‌లు మాత్రం అలానే ఉంటున్నాయి. కూట‌మి ప్ర‌భుత్వం ఉండ‌డం.. మూడు పార్టీలు క‌లిసి ముందుకు సాగ‌డంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు ఎవ‌రికి వారే పెత్త‌నం చేసేందుకు ప‌రిత‌పిస్తున్నారు. దీనిలో మేం ముందంటే..మేం ముంద న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీనికి ఎవ‌రూ అతీతులు కాదు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదే ప‌రిస్థితి నెలకొంది. దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు వివాదాలు.. విమ‌ర్శ‌లు కామ‌న్ అయ్యాయి.

తాడేప‌ల్లిగూడెం, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ స‌హా.. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల తీరు భిన్నంగా మారింది. అయితే.. వీటికి భిన్నంగా మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు స‌ర్దుకు పోతున్నారు. పెత్త‌నం మాట ఎత్త‌కుండా..క‌లివిడిగానే ముందుకు సాగుతున్నారు. కానీ.. అక్క‌డ కూడా స‌మస్య‌లు వ‌స్తున్నాయి. దీనికి కార‌ణం.. ఎవ‌రు? ఏంటి? అనేది తెలియ‌డం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు రాజ‌మండ్రి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో నాయ‌కులు క‌లివిడిగా ఉంటున్నారు.

ఒక‌వేళ క‌లివిడి లేక‌పోయినా.. విడివిడిగా ఉన్నా.. ఎవ‌రూ కూడా ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకోవ‌డం లే దు. మౌనంగా ఉంటున్నారు. కానీ, అంత‌ర్గ‌తంగా కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లో మాత్రం ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. కేంద్రం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌కు తామే కొబ్బ‌రికాయ కొడ‌తామ‌ని బీజేపీ నాయ‌కులు వ‌స్తున్నారు. కానీ, కేంద్రం నిధుల‌కు రాష్ట్రం కూడా తోడైంద‌ని.. కాబ‌ట్టి తాము కూడా వ‌స్తామ‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. అయితే.. ఇది వివాదం కాక‌పోయినా.. స‌మ‌స్య‌గా మారింది.

అధికారులు ప్రొటోకాల్ ప్ర‌కారం వ్య‌వ‌హ‌రిస్తే.. అది కూడా ఇబ్బందిగానే మారుతోంది. క‌డ‌ప పార్ల‌మెంటు ప‌రిధిలో వైసీపీ నాయ‌కుడు ఎంపీగా ఉన్నారు. కానీ, ఇక్క‌డ కార్య‌క్ర‌మాల‌కు టీడీపీ-బీజేపీ నాయ‌కులే హాజ‌రవుతున్నారు.ఇక్క‌డ కూడా క‌లివిడి లేక‌పోయినా.. నాయ‌కుల మ‌ధ్య నేరుగా యుద్ధం చేసుకునే ప‌రిస్థితి లేదు. ఒక‌రిద్ద‌రు త‌ప్ప‌.. మిగిలిన వారు క‌లిసి పోతున్నారు. కానీ, ప్రొటోకాల్ ప్ర‌కారం ఎంపీకి ఆహ్వానం ప‌ల‌కాలి. కానీ, అలా చేయ‌డం లేదు.

ఇక‌, విజ‌య‌న‌గ‌రం ఎంపీ క‌లిశెట్టి అప్ప‌ల నాయుడు.. తన దైన శైలిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. టీడీపీ కంటే కూడా.. ఆయ‌న బీజేపీ నాయ‌కుల‌కు ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇస్తున్నార‌న్న‌ది అంత‌ర్గ‌త టాక్‌. అయితే.. ఎవ‌రూ బ‌య‌ట‌కు రారు.. గొడ‌వ‌లు ప‌డ‌రు. కానీ, అంత‌ర్గ‌త స‌మ‌స్య‌లు మాత్రం కొన‌సాగుతూనే ఉన్నాయ‌ని తెలుస్తోంది.