Begin typing your search above and press return to search.

"పందులకు, పాకిస్తానీయులకు నో ఎంట్రీ!"..ఇండోర్‌లో భగ్గుమన్న ఆగ్రహం

పహల్గామ్‌లో అంతమంది అమాయకులు చనిపోవడానికి కారణమైన ఉగ్రదాడి తర్వాత దేశం మొత్తం కోపంతో ఊగిపోతుంది.

By:  Tupaki Desk   |   25 April 2025 6:51 AM
Indore Chappan Dukan Erects Banners Protesting Pakistan
X

పహల్గామ్‌లో అంతమంది అమాయకులు చనిపోవడానికి కారణమైన ఉగ్రదాడి తర్వాత దేశం మొత్తం కోపంతో ఊగిపోతుంది. ఆ టైమ్‌లో ఇండోర్‌లోని ఒక ఫుడ్ స్టాల్ ముందు పెట్టిన బోర్డు అందరి దృష్టిని ఆకర్షించింది. దాని మీద "పందులు, పాకిస్తాన్ సిటిజన్లు ఛప్పన్ దుకాన్‌లోకి రావొద్దు" అని పెద్దగా రాసి ఉంది.

ఇండోర్ లోని బాగా పేరున్న ఫుడ్ స్ట్రీట్ ఛప్పన్ దుకాన్‌లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఫోటోను పంది మొహంలా మార్చి పెట్టారు. ఆ పోస్టర్‌తో చాలామంది అక్కడికి వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. అదో పెద్ద నిరసనలా మారింది.

ఆ పోస్టర్ ఎందుకు పెట్టారో ఛప్పన్ దుకాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుంజన్ శర్మ చెబుతూ.. "వాళ్లు (పాకిస్తాన్) మనవాళ్ల విశ్వాసాన్ని టార్గెట్ చేశారు. అందుకే మేం ఇలా నిలబడి న్యాయం అడుగుతున్నాం. మోదీ గారు దీనికి గట్టిగా సమాధానం చెబుతారని ఎదురు చూస్తున్నాం.’’ అన్నారు.

ఆ ఫుడ్ స్ట్రీట్‌లోని వ్యాపారులు, పనిచేసేవాళ్లు కూడా నల్ల బ్యాడ్జీలు కట్టుకుని దాడిలో చనిపోయినవాళ్లకు తమ సంతాపాన్ని తెలిపారు. లోకల్ లాయర్ లోకేష్ మంగల్ ప్రధాని మోదీకి ఒక లెటర్ రాశారు. పహల్గామ్ దాడితో సంబంధం ఉన్న ఏ ఉగ్రవాదినైనా చంపితే, అది సైనికుడైనా సరే, సామాన్యుడైనా సరే, కోటి రూపాయలు రివార్డు ఇస్తామంటూ ప్రకటించారు.

వంద మంది ఉగ్రవాదులను చంపితే వంద కోట్లు ఇస్తానని మంగల్ తేల్చి చెప్పారు. "మేం రక్షణ కోసం టాక్స్ కడుతున్నాం కదా. ఆ డబ్బులో కొంచెం మా భద్రత కోసం ఎందుకు వాడకూడదు?" అని ఆయన అడిగారు. తన సవాలు కింద దేశం కోసం పనిచేసే ఎవరికైనా ఫ్రీగా లీగల్ హెల్ప్ కూడా ఇస్తానంటూ ఆయన ప్రామిస్ చేశారు. ఏప్రిల్ 22, 2025న పిరికిపందల్లా చేసిన ఆ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. చాలామంది గాయపడ్డారు.