Begin typing your search above and press return to search.

అమెరికాలో ముగ్గురు కుటుంబ సభ్యుల్ని కాల్చేసిన భారత విద్యార్థి!

అగ్రరాజ్యం అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. దీనికి భారత్ విద్యార్థి కారణం కావటం కలకలంగా మారింది.

By:  Tupaki Desk   |   30 Nov 2023 5:01 AM GMT
అమెరికాలో ముగ్గురు కుటుంబ సభ్యుల్ని కాల్చేసిన భారత విద్యార్థి!
X

అగ్రరాజ్యం అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. దీనికి భారత్ విద్యార్థి కారణం కావటం కలకలంగా మారింది. సొంత కుటుంబ సభ్యులు ముగ్గురిని కాల్చిన ఉదంతం న్యూజెర్సీలో చోటు చేసుకుంది. 23 ఏళ్ల భారతీయ విద్యార్థి ఓం బ్రహ్మభట్ తన తాత.. అవ్వతో పాటు మామను దారుణంగా హత్య చేశాడు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు వెల్లడించారు.

వారి కథనం ప్రకారం 72 ఏళ్ల బ్రహ్మభట్.. 72 ఏళ్ల బిందు భట్.. 38 ఏళ్ల యశ్ కుమార్ బ్రహ్మభట్ లను ఓం బ్రహ్మ భట్ లు పిస్టల్ తో కాల్చి చంపేశాడు. గుజరాత్ నుంచి వలస వచ్చిన ఓం బ్రహ్మభట్.. బాధితులతో కలిసి జీవిస్తున్నాడు. ఎలాంటి కనికరం లేకుండా ముగ్గురు కుటుంబ సభ్యుల్ని అతను ఎందుకు కాల్చి చంపాడన్న దానిపై స్పష్టత రాలేదు.

ఆన్ లైన్ లో కొన్న పిస్టల్ తో ముగ్గురిని హతమార్చాడు. కాల్పుల మోతతో చుట్టు పక్కల వారు సమాచారం ఇవ్వటంతో హుటాహుటిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నాడు. ముగ్గురిని హతమార్చిన ఓం బ్రహ్మభట్ ఇంట్లోనే ఉన్నాడు. అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై మూడు హత్యల అభియోగాల్ని నమోదు చేశారు. ఎందుకంత ఉన్మాదంగా వ్యవహరించాడన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.