Begin typing your search above and press return to search.

ఆపరేషన్ సిందూర్... దాడుల్లో హతమైన ఉగ్రవాదులు వీరే!

అయితే.. దీనిని త‌మ‌పై జ‌రిగిన దాడిగా భావిస్తున్న పాకిస్థాన్‌.. భార‌త్‌పై నేరుగా యుద్ధానికి దిగింది. దీనిని ప్ర‌తిఘ‌టిస్తూ.. భార‌త్ ఎదురు దాడి ముమ్మ‌రం చేసింది.

By:  Tupaki Desk   |   10 May 2025 3:02 PM IST
ఆపరేషన్  సిందూర్... దాడుల్లో హతమైన ఉగ్రవాదులు వీరే!
X

ఏప్రిల్ల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడికి ప్రతికారంగా మే 7వ తేదీ తెల్లవారుజామున 1:05 నుంచి 1:30 వరకూ పాక్, పీఓకే లోని ఉగ్రశిబిరాలపై భారత సైన్యం విరుచుకుపడిపోయింది. కేవలం 25 నిమిషాల్లో 9 ఉగ్రశిబిరాలు, 100కు పైగా ఉగ్రమూకల నాశనం జరిగింది. ఈ సమయంలో ఆ దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల పేర్లు బయటకు వచ్చాయి.

అవును... కేవలం 25 నిమిషాల వ్యవధిలో దాదాపు 970 కి.మీ. విస్తీర్ణంలో 100మందికి పైగా ఉగ్రమూకలను భారత సైన్యం మట్టుబెట్టింది. ఈ స్థాయిలో దత్తపుత్రుల చావు వార్త విని పాక్ విలవిల్లాడింది! ఈ సమయంలో.. ఆ దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల పేర్లు తెరపైకి వచ్చాయి. వారంతా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలకు చెందిన కీలక వ్యక్తులుగా చెబుతున్నారు.

భారత దాడుల్లో మరణించిన అనేక మంది ఉగ్రవాదుల్లో ప్రస్తుతం ఐదుగురు పేర్లు బయటకు రాగా.. లష్కరే తోయిబాకు చెందిన వారు ముగ్గురు, జైషే మహ్మద్ గ్రూపుకు చెందిన వారు ఐదుగురు ఉన్నారు. వీరంతా పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఆయా ఉగ్రవాద సంస్థల్లో అత్యంత ఉన్నత స్థాయి వ్యక్తులని, ఆ సంస్థల చీఫ్ ల బందువులని చెబుతున్నారు.

తాజాగా బయటకు వచ్చిన పేర్లలో... జైషే చీఫ్ మసూద్ అజార్ పెద్ద బావమరిది, బహావల్ పూర్ లోని మర్కజ్ సుభాన్ అల్లా ఆధిపతి హఫీజ్ మహ్మద్ జమీల్ కూడా ఉన్నాడు. యువతను తీవ్రవాదం వైపు నడిపించడంలో ఇతడు ప్రసిద్ధి చెందాడు. ఇక లష్కరే అగ్ర కమాండర్ ముదస్సర్ ఖదియాన్ ఖాస్ అంత్యక్రియలో పాక్ సైన్యం గౌరవ వందనం సమర్పించింది.

ఐదుగురు ఉగ్రవాదుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి!:

1. ముదస్సర్ ఖధియాం ఖాస్ (లస్కరే తోయిబా అగ్ర కమాండర్)

2. హఫీజ్ మహ్మద్ జమీల్ (జైషే మహ్మద్ మసూద్ అజర్ పెద్ద బావమరిది)

3. మహ్మద్ యూస్ అజార్ (ఐసీ-814 హైజాక్ కేసులో వాంటెడ్.. జైషే మహ్మద్ అజర్ మరో బావమరిది)

4. ఖలీద్ అలియాస్ అబు అకాసా (లష్కరే తోయిబాకు చెందినవాడు.. జమ్మూకశ్మీర్ లో పలు ఉగ్రదాడుల్లో పాల్గొన్నాడు)

5. మహ్మద్ హసన్ ఖాన్ (జైషే మహ్మద్ కు చెందిన ఉగ్రవాది)