అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీ... యుద్ధానికి ధోనీ, మోహన్ లాల్!
ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రవాదులపై ప్రతీకార దాడులు చేసిన భారత సైన్యం.. ఎల్వోసీ, ఐబీ వద్ద పాక్ చేస్తున్న పనులకు ప్రతీకారం తీర్చుకునే పనిలో బిజీగా ఉంది.
By: Tupaki Desk | 9 May 2025 4:24 PM ISTఆపరేషన్ సిందూర్ తో ఉగ్రవాదులపై ప్రతీకార దాడులు చేసిన భారత సైన్యం.. ఎల్వోసీ, ఐబీ వద్ద పాక్ చేస్తున్న పనులకు ప్రతీకారం తీర్చుకునే పనిలో బిజీగా ఉంది. ఇందులో భాగంగానే పాక్ పై విరుచుకుపడుతుందని అంటున్నారు. ఈ సమయంలో సరిహద్దుల్లో భారత్ ను మరింత ఇబ్బంది పెట్టాలనే పాక్ ప్రయత్నాలకు మరింత బలంగా చెక్ పెట్టాలని కేంద్రం భావిస్తోంది. దీంతో కీలక నిర్ణయం తీసుకుంది.
అవును... డ్రోన్లు, క్షిపణులతో భారత్ పై దాడి చేయాలనే పాక్ ప్రయత్నాలను సైన్యం తిప్పికొట్టింది. ఈ సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేసి భారత్ ను ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ కు మరిన్ని అధికారాలు అప్పగిస్తూ కేంద్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా... అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని స్పష్టం చేసింది.
ఇందులోని అధికారులను, నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిచేందుకు ఆర్మీ చీఫ్ కు అధికారాలు కల్పించింది. ఇదే సమయంలో టెరిటోరియల్ ఆర్మీ అంతా రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది.
ఏమిటీ టెరిటోరియల్ ఆర్మీ?
దేశంలో క్లిష్టపరిస్థితులు ఎదురైనప్పుడు భారత రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉటుంది. ఇందులోని సిబ్బంది, అధికారులకు ఆర్మీ తరహాలోనే ట్రైనింగ్ ఉంటుంది అయితే వీరంతా బయట వారివారి పనులు, ఉద్యోగాలు చేసుకుంటూనే వాలంటీరీగా సైన్యంతో పనిచేస్తుంటారు. 1948లోని భారత టెరిటోరియల్ అర్మీ చట్టం ఆమోదించగా.. 1949లో అధికారికంగా ప్రారంభమైంది.
ఈ క్రమంలో... ఈ ఆర్మీలో ప్రస్తుతం సుమారు 50 వేల మంది ఇవరకూ ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా రెగ్యులర్ ఆర్మీలో భాగమే అయినప్పటికీ.. నిరంతరం సైన్యంతో ఉండరు. అయితే.. అవసరమైనప్పుడు మాత్రం విపత్తు, కదన రంగంలోకి దిగుతారు. ఈ నేపథ్యలో.. తాజాగా భారత్ – పాక్ ఆర్మీ మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వీరి సేవలను ఉపయోగించుకునే అధికారాన్ని ఆర్మీ చీఫ్ కు కేంద్రం తాజాగా ఇచ్చింది.
టెరిటోరియల్ ఆర్మీలో సెలబ్రెటీలు:
టెరిటోరియల్ ఆర్మీలో పలువురు సెలబ్రెటీలు ఉన్నారు. ఇందులో లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో నటుడు మోహన్ లాల్ తో పాటు టీమిండియా వెటరన్ స్టార్ కపిల్ దేవ్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, సచిన్ పైలట్, అనురాగ్ ఠాకూర్, అభినవ్ బింద్రా లు ఉన్నారు. వీరిలో ఇటీవల కేరళ వరదల్లో మోహన్ లాల్ తన వంతు సేవలందించారు. ఇప్పుడు అవసరమైతే వీరి సేవలను ఆర్మీ వినియోగించుకోనుంది!