పాక్ దుస్థితి: సేఫ్ హౌస్ లో ప్రధాని... (హౌస్) అరెస్ట్ లో ఆర్మీ చీఫ్!
ఎరక్కపోయి వస్తే.. ఎలా ఇరుక్కుపోతారో.. అన్నీ తెలిసి అడ్డంగా దిగితే.. అలా ఊబిలో కూరుకుపోతారు అనే విషయం పాక్ కు ఎన్నిసార్లు అనుభవంలోకి వచ్చినా మారడం లేదు!
By: Tupaki Desk | 9 May 2025 12:59 PM ISTఎరక్కపోయి వస్తే.. ఎలా ఇరుక్కుపోతారో.. అన్నీ తెలిసి అడ్డంగా దిగితే.. అలా ఊబిలో కూరుకుపోతారు అనే విషయం పాక్ కు ఎన్నిసార్లు అనుభవంలోకి వచ్చినా మారడం లేదు! భారత్ తో కయ్యానికి కాలు దువ్వడం అంటే.. తమ దేశంలో పది మంది ఉగ్రవాదుల ముందు మైకుల్లో రెచ్చగొట్టే కబుర్లు చెప్పి, చప్పట్లు కొట్టించుకోవడం కాదనే విషయం ఆ దేశ పెద్దలకు తెలిసొచ్చిందని తెలుస్తోంది.
అవును... భారత్ తో కయ్యానికి కాలుదువ్వింది పాకిస్థాన్. ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంటే.. అమాయకులైన తమ అమరవీరుల మరణాలకు ప్రతీకారం తప్పదని చెబుతూ.. తగుదునమ్మా అంటూ భారత్ పైకి ఉన్న నాలుగు డ్రోన్లు వదిలింది! దీంతో.. ఆ డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్ లను నేల కూల్చిన భారత్... అదే అదనుగా పాక్ గుండెలపై గ్యాప్ లేకుండా గుద్దేస్తుంది.
ఈ నేపథ్యంలోనే ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ లోని ప్రధాని నివాసానికి సమీపంలో బాంబులు పేలాయి! ఆ పేలుడు శబ్ధాలు పాక్ అధికార యంత్రాంగాన్ని వణికించేశాయి. దీంతో... అధికార యంత్రాంగం సూచనల మేరకో, ఈయన రిక్వస్ట్ మేరకో గానీ.. ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధాని సేఫ్ హౌస్ లో ఉన్నారని మీడియా నివేదికలు వెలువడుతున్నాయి.
అసీమ్ మునీర్ హౌస్ అరెస్ట్!:
ఇదే సమయంలో గురువారం రాత్రి వెలుగులోకి వచ్చిన ధృవీకరించిన మీడియా నివేదికల ప్రకారం.. పాకిస్థాన్ సైన్యంలోని అగ్రశ్రేణిలో అధికార పోరాటం జరుగుతుందని అంటున్నారు. ఇందులో... ఛైర్మన్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (సీజేసీఎస్సీ) జనరల్ సాహీర్ సంషాద్ మీర్జా.. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్) జనరల్ అసీమ్ మునీర్ పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే మునీర్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సైన్యంలోని ఓ బలమైన వర్గానికి నాయకత్వం వహిస్తున్నారనే ఆరోపణలున్న సాహీర్ సంషాద్... మునీర్ ను అదుపులోకి తీసుకుని (హౌస్) అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే... దీనిపై ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐ.ఎస్.పీ.ఆర్) నుంచి స్పష్టత రావాల్సి ఉంది!