ముగిసిన భారత్ - పాక్ డీజీఎంవో చర్చలు.. టాపిక్స్ ఇవే!
అవును... భారత్ – పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు, కాల్పుల విరమణ అనంతరం నేడు ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో)లు భేటీ అయ్యారు.
By: Tupaki Desk | 12 May 2025 2:01 PMభారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో శనివారం మధ్యాహ్నం 3:30 కి పాక్ డీజీఎంవో.. భారత డీజీఎంవో కు ఫోన్ చేశారని.. అనంతరం ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత సీజ్ ఫైర్ ప్రకటన వచ్చిందనే ప్రకటన వచ్చింది.
ఆ సందర్భంగా స్పందించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి.. ఇరు దేశాల మధ్య సైనిక చర్యలను సాయంత్రం 5 గంటల నుంచి నిలిపేయాలని అంగీకరించినట్లు తెలిపారు. మే 12న డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ మళ్లీ మాట్లాడతారని విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ నేపథ్యంలో చెప్పినట్లుగానే ఈ రోజు మీటింగ్ జరిగింది.
అవును... భారత్ – పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు, కాల్పుల విరమణ అనంతరం నేడు ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో)లు భేటీ అయ్యారు. ముందుగా ప్రకటించినట్లుగా మధ్యాహ్నం 12 గంటలకే చర్చలు జరగాల్సి ఉన్నా.. సాయంత్రానికి వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల డీజీఎంవోలు చర్చించుకున్నారు.
ఈ క్రమంలో తాజాగా వారిరువురి మధ్య చర్చలు ముగిసాయి. వీరి మధ్య ప్రధానంగా.. కాల్పుల విరమణ కొనసాగింపు, పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఉద్రిక్తతల తగ్గింపు మొదలైన అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే... ఈ చర్చల్లో ఏమి తేలిందనే విషయం మాత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది!
మరోవైపు ఈ రోజు (సోమవారం) రాత్రి 8 గంటలకు ప్రధాని మోడీ దేశప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. పాక్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్, ఇరుదేశాలు చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ప్రధాని మొదటిసారిగా సోమవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.