Begin typing your search above and press return to search.

పాక్ ఉన్మాదం...ఉనికికే ప్రమాదం

పాకిస్థాన్ ఆవేశంతో ఏర్పడిన దేశం. ఆ ఆవేశానికి తోడు ఉన్మాదంతో కూడిన ఆలోచనలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   8 May 2025 5:38 PM
పాక్ ఉన్మాదం...ఉనికికే ప్రమాదం
X

పాకిస్థాన్ ఆవేశంతో ఏర్పడిన దేశం. ఆ ఆవేశానికి తోడు ఉన్మాదంతో కూడిన ఆలోచనలు ఉన్నాయి. దాంతో పాక్ ఈ రోజుకీ ఒక దేశంగా మనలేకపోతోంది. పాక్ పెట్టే నొప్పులు అన్నీ భారత్ గత ఆరున్నర దశాబ్దాలుగా భరిస్తూ వస్తోంది. ఇది చివరికి ఎలా తయారైంది అంటే చూస్తూ లైట్ తీసుకుంటే ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ రెచ్చిపోతోంది.

అలాగని వారి మీద సీరియస్ అయితే మా దేశం మీదకే దండెత్తుతారా అని ఆగ్రహించి మరీ మీదకు వస్తోంది. పాక్ లోని ఉగ్ర శిబిరాలను భారత్ లక్ష్యంగా చేసుకుని వాటిని ధ్వంసం చేసింది ఇది ప్రపంచమంతా చూసింది. మరి పాక్ కి ఎందుకు కోపం ఇక్కడ. ఉగ్రవాద బాధిత దేశంగా మేమూ ఉన్నామని చెప్పుకునే పాక్ కి ఉగ్రవాదుల స్థావరాలు నాశనం అయితే ఏడుపు ఎందుకు అన్నదే ప్రశ్న.

ఇక వారి అంత్యక్రియలకు సైనికాధికారులు హాజరు కావడం ఆసుపత్రులలో ఉగ్రవాదులని పరామర్శించడం ద్వారా తమ దేశానిది ఉగ్ర ఉన్మాదమని పాక్ చెప్పకనే లోకానికి చెప్పింది. అంతటా బరితెగింపు బుకాయింపు అబద్ధాలు అసత్యాలతో పాక్ ఇన్నేళ్ళూ నెట్టుకుని వచ్చింది. పాక్ భుజం మీద గురిపెట్టి భారత్ ని టార్గెట్ చేయాలన్న కొన్ని కక్కుర్తి దేశాల వల్లనే పాక్ ఈ రోజుకీ అలా నిలిచి ఉంది అన్నది వాస్తవం.

చేసిన తప్పులు ఒప్పుకోక ఉగ్ర మూకలను భారత్ పైకి విచ్చలవిడిగా పంపుతూ ఏకంగా వారికే ఆశ్రయం కల్పిస్తూ ప్రజలను పేదలుగా చేస్తూ పాక్ ఆడుతున్న వింత నాటకాలకు ఫుల్ స్టాప్ పడాల్సిన సమయం ఇపుడేనేమో అనిపిస్తోంది. కవ్వింపు చర్యలతో భారత్ ని యుద్ధం ముగ్గులోకి దింపి ఏదో సాధించాలని పాక్ చూడడం వెనక మూర్ఖత్వమే ఉంది తప్ప మరేమీ లేదు.

తన దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని తెగ నీలుగుతున్న పాక్ కి అవి టచ్ చేసేలోగానే భారత్ ఆ దేశ చరిత్రను సమాప్తం చేస్తుంది అన్నది కనుక అర్ధం అయితే విషయం ఇంతదాకా వచ్చేది కాదు. భారత్ లోని పదిహేను నగరాల మీద దాడులు చేయడానికి పాక్ సిద్ధపడడాన్ని ఎలా చూడాలి. జమ్మూ కాశ్మీర్ ఎయిర్ పోర్టుని ఎటాక్ చేయడానికి చేసిన చర్యలను ఎలా అర్ధం చేసుకోవాలి అన్నది కూడా ఈ రోజున ప్రపంచం అంతా ఆలోచించాలి.

ఉగ్రవాద బాధిత దేశంగా ఎన్నో దెబ్బలు తిని ఎంతో ఆస్తి ధన ప్రాణాలను ఫణంగా పెడుతున్న భారత్ ఈ రోజు తన దేశం కోసం తన హక్కుగా ఉగ్ర శిబిరాలను ఎటాక్ చేస్తే అందులో కూడా తప్పు వెతికి పాక్ కి ఊతం ఇవ్వాలనుకునే ముష్కర ఆలోచనలు కలిగిన దేశాలకు ఉగ్ర భూతం వారిని సైతం కబలిస్తుంది అన్నది తెలిసి రావాల్సి ఉంది ధర్మ యుద్ధం భారత్ చేస్తోంది. అయితే పెద్దన్నలు తమ్ముళ్ళూ అయిన దేశాలు డబుల్ స్టాండర్డ్ గా వ్యవహరిస్తే అంతిమంగా వారికే నష్టం అన్నది గుర్తెరగాలి

ఇక భారత్ ఎవరి మెప్పు కోసమో గొప్ప కోసమో చూడదు, తన దేశం కోసం పాక్ ని ఉరుకులు పెట్టించి పరుగులు తీయించి ఎందాకైనా వెంటపడి మరీ తరుముతుంది. ఈ క్రమంలో పాక్ ఉనికి ఏ విధంగా ఉండబోతోంది అన్నది దేవుడికే ఎరుక. ఒక్కసారి పట్టు పట్టాక వదిలేయడం భారత్ వద్ద లేదు. పాక్ ప్రగల్బాలతో మితిమీరిన అక్కసుతో ఉన్మాదంతో చేసే వికృత చేష్టలకు ఆ దేశమే బలి అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఏది ఏమైనా పాక్ వంటి దేశం ఒకటి ఉండడం మాత్రం భారత్ కి భౌగోళిక శాపం అయితే దానికి తగిన పరిష్కారాలు వెతికే తెలివిడి కూడా భారత్ కే ఉంది. అది తొందరలోనే అందరికీ తెలిసి వస్తుంది.