Begin typing your search above and press return to search.

భారత్ కు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (జైలు నుంచి) వార్నింగ్!

ఈ సందర్భంగా... గతంలో పల్వామా ఘటన జరిగినప్పుడు తాము భారత్ కు పూర్తి సహకారాన్ని అందించాలని ప్రతిపాదించామని.

By:  Tupaki Desk   |   30 April 2025 11:54 AM
భారత్  కు పాక్  మాజీ ప్రధాని ఇమ్రాన్  ఖాన్ (జైలు నుంచి) వార్నింగ్!
X

పహల్గాం ఉగ్రదాడితో పాకిస్థాన్ – భారత్ మధ్య వాతావారణ అన్ని రకాలుగానూ వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దౌత్యపరంగా పాకిస్థాన్ కు భారత్ గట్టి షాక్ ఇవ్వగా... మరోపక్క సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు భారత ప్రధాని మోడీ ప్రకటించడంతో.. ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే చర్చ బలంగా జరుగుతుంది. ఈ సమయంలో ఇమ్రాన్ ఖాన్ స్పందించారు.

అవును... పహల్గాం ఉగ్రదాడి అనంతరం పరిణామాల్లో భాగంగా పాకిస్థాన్ – భారత్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజలు పాకిస్థాన్ పై ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. ఈ సమయంలో ప్రస్తుతం జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ.. భారత్ కు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఇందులో భాగంగా... పహల్గాం ఘటనలో ప్రాణ నష్టం తనను తీవ్ర కలతపెట్టింద్ని, అది తీవ్ర విషాదకరమని చెబుతూ.. బాధితులకు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు ఇమ్రాన్ ఖాన్. అనంతరం... భారత్ ఏదైనా దాడికి పాల్పడితే ఆ దేశాన్ని తట్టుకునే శక్తి, తిరిగి పోరాడగల సామర్థ్యం పాకిస్థాన్ కు ఉన్నాయని అన్నారు.

ఈ సందర్భంగా... గతంలో పల్వామా ఘటన జరిగినప్పుడు తాము భారత్ కు పూర్తి సహకారాన్ని అందించాలని ప్రతిపాదించామని.. అయితే, భారత్ మాత్రం ఖచ్చితమైన ఆధారాలను సమర్పించలేదని. పహల్గాం ఘటనలోనూ తాను ఊహించినట్లుగానే జరుగుతోందని.. ఆత్మ పరిశీలనకు బదులు మోడీ సర్కార్ మళ్లీ పాక్ పై నిందలు మోపుతుందని అన్నారు.

ఇదే సమయంలో.. 1.5 బిలియన్ల జనాభా కలిగిన దేశం భారత్.. ఇప్పటికే అణూ యుద్ధ బిందువు అని పిలువబడే ప్రాంతంతో చెలగాటమాడకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఇమ్రాన్ ఖాన్... పాక్ వద్ద అణు ఆయుధాలు ఉన్నాయని చెప్పి బెదిరించే పనికి పూనుకున్నారు! పైగా.. తమ శాంతి ప్రాధాన్యతను పిరికితనంగా భావించొద్దని సూచించడం గమనార్హం.

అదేవిధంగా... భారత్ ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్.ఎస్.ఎస్. సిద్ధాంతం చాలా ప్రమాధకరమైనదని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఆయన.. అక్కడి ఉన్నతాధికారుల ద్వార తన అధికార ఎక్స్ ఖాతా నుంచి ఈ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు... ఈ పోస్ట్ భారతీయులను మరింత రెచ్చగొట్టేలా ఉందని ఒకరంటే.. ఇమ్రాన్ ఖాన్ మాటల్లో భయం స్పష్టంగా ధ్వనిస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.