Begin typing your search above and press return to search.

3 నెలల క్రితం పెళ్లి.. భర్త మరణం.. భార్య సూసైడ్

పెళ్లైన కొత్తల్లో సరదాగా పలు ప్రాంతాల్ని సందర్శిస్తున్న వీరు.. సోమవారం ఢిల్లీలోని జూకు వీరిద్దరు వెళ్లారు

By:  Tupaki Desk   |   28 Feb 2024 4:59 AM GMT
3 నెలల క్రితం పెళ్లి.. భర్త మరణం.. భార్య సూసైడ్
X

చదివినంతనే అయ్యో అనిపించే విషాదంగా దీన్ని చెప్పాలి. పెళ్లైన మూడు నెలల వ్యవధికే భార్య.. భర్తలు మరణించిన అనూహ్య ఉదంతంగా దీన్ని చెప్పాలి. ఢిల్లీకి చెందిన ఈ నవ దంపతుల విషాద ఉదంతం గురించి తెలిసిన వారంతా షాక్ కు గురవుతున్నారు. ఢిల్లీలోని గాజియాబాద్ కు చెందిన పాతికేళ్ల అభిషేక్ అహ్లువాలియాకు అంజలి అనే యువతితో పెళ్లైంది. మూడు నెలల క్రితం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

పెళ్లైన కొత్తల్లో సరదాగా పలు ప్రాంతాల్ని సందర్శిస్తున్న వీరు.. సోమవారం ఢిల్లీలోని జూకు వీరిద్దరు వెళ్లారు. అయితే.. అనుకోని విధంగా అభిషేక్ కు ఛాతీ నొప్పి వచ్చింది. వెంటనే స్పందించిన స్నేహితులు అతడ్ని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. కండీషన్ సీరియస్ గా ఉండటంతో వెంటనే సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అభిషేక్ చనిపోయాడు.

ఇంటికి తీసుకొచ్చిన భర్త డెడ్ బాడీని చూసి అంజలి తట్టుకోలేకపోయింది. ఏడో అంతస్తులోకి వెళ్లిన ఆమె.. అక్కడి బాల్కనీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి చేర్చగా చికిత్స పొందుతూ మరణించింది. దీంతో.. నవదంపతులుఇద్దరు గంటల వ్యవధిలో ప్రాణాలు విడిచిన వైనంతో ఇరు కుటుంబాల వారు.. వీరి ఉదంతం గురించి తెలిసిన వారంతా షాక్ తింటున్న పరిస్థితి.