Begin typing your search above and press return to search.

దారుణం... ప్రశ్నించడమే ఆ భార్య చేసిన నేరం!

అవును... ఓ వ్యక్తి తన భార్యను సముద్రంలో ముంచి హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

By:  Tupaki Desk   |   21 Jan 2024 12:20 PM GMT
దారుణం... ప్రశ్నించడమే ఆ భార్య చేసిన నేరం!
X

ఈ మధ్యకాలంలో చంపడం అంటే చాలా సులువైపోయినట్లుంది జనాలకు! ప్రతీ సమస్యకూ చావే పరిష్కారం అని కొందరనుకుంటుంటే.. చంపడమే సొల్యూషన్ అని మరికొందరు భావిస్తున్నారు అనే చర్చ సమాజంలో బలంగా నడుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తనను ప్రశ్నించినందుకు భార్యను బీచ్ లో ముంచి చంపేశాడు. అనంతరం దీన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఓ ప్రబుద్దుడు!!

అవును... ఓ వ్యక్తి తన భార్యను సముద్రంలో ముంచి హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అతడి వివాహేతర సంబంధంపై ప్రశ్నించినందుకు నిందితుడు తన భార్యకు హత్యచేయాలని భావించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోవాలోని కాబో డి రామా బీచ్‌ లో ఈ ఘటన జరిగింది.

వివరాళ్లోకి వెళ్తే... సౌత్‌ గోవాలోని ఓ లగ్జరీ హోటల్‌ లో గౌరవ్ కటియార్ (29) మేనేజర్‌ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో దీక్షా గంగ్వార్‌ (27) అనే యువతిని గతేడాదే వివాహం చేసుకున్నాడు. లక్నోకే చెందిన వీరిద్దరూ గోవాలోనే నివసిస్తున్నారు. ఈ క్రమంలో గౌరవ్ కటియార్ వివాహేతర సంబంధంపై దీక్ష ఇటీవల ప్రశ్నించింది. అక్కడ నుంచి సమస్య మొదలైందని తెలుస్తుంది!

ఇలా తన వివాహేతర సంబంధం గురించి భార్య నిలదీయడంతో.. ఆమెను హత్య చేయాలని కటియార్ కుట్ర పన్నాడని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆమెను బీచ్‌ కు షికారుకు తీసుకువెళ్లాడు. ఈ సమయంలో ఎవరూ లేని రాళ్ల ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆమెను నీళ్లలో ముంచి చంపేసి.. ఆ తర్వాత యథావిధిగా కార్యాలయానికి తిరిగి వచ్చాడని అంటున్నారు!

ఇదే సమయంలో అసలు ఆమె నిజంగా చనిపోయిందో లేదో నిర్దారించుకోవడానికి మళ్లీ ఓ సారి వెళ్లి చూశాడట. ఆమె మృతి కన్ ఫాం అవ్వడంతో.. తన భార్య నీళ్లలో మునిగి చనిపోయిందని పోలీసులకు తెలిపాడు. అయితే.. ఓ టూరిస్ట్ తీసిన వీడియో ఆధారంగా కటియార్ కుట్ర బయటపడిందని తెలుస్తుంది.

దీంతో... ఇదంతా ప్లాన్ చేసి చేసిన హత్య అని భావించిన పోలీసులు... కటియార్‌ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.