Begin typing your search above and press return to search.

శిరోముండనం చేసి, కనుబొమ్మలు తీసి... భార్యపై కర్కశత్వం!

ఈ నేపథ్యంలో... ఈ నెల 18న రాత్రి ఆమెను కొట్టడంతో పాటు ఇంట్లో ఉన్న ట్రిమ్మర్ తో గుండు గీసి, కనుబొమ్మలు తీసేశాడని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   23 March 2024 7:30 AM GMT
శిరోముండనం చేసి, కనుబొమ్మలు  తీసి... భార్యపై కర్కశత్వం!
X

కొంతమంది భర్తలు కట్టుకున్న భార్యలపై చూపించే కర్కశత్వం ఒక్కోసారి భయబ్రాంతులకు గురిచేస్తుంటుంది! వివాహ వ్యవస్థకు ఎంతో విలువిచ్చే దేశంలో.. సహధర్మంచారిని అనే సంస్కారం లేకుండా, ఇల్లాలు అనే ఇంగితం లేకుండా, కొంతమంది భర్తలు పురుషాహంకారంతోనో, భార్యపై అనుమానంతోనో భౌతిక దాడులకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో తాజాగా విశాఖ నగరంలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.

అవును... ఇటీవల కాలంలో అదనపు కట్నం కోసమో, అనుమానం అనే పురుగు తొలచడంతోనో తెలియదు కానీ... భార్యపై దాడులు చేస్తున్న భర్తల సంఖ్య పెరిగిపోతుంది. ఇష్టమైతే కలిసి ఉండండి.. లేకపోతే విడిపోండనే సలహాలు ఇచ్చే వారు, అందుకు సహకరించేవారూ పుష్కలంగా ఉన్న ఈ రోజుల్లో కూడా... భర్యలపై భౌతిక దాడులకు పాల్పడటం, భర్తలపై హత్యాయత్నాలు చేయించడం పెరిగిపోతున్నాయి! ఈ క్రమంలో తాజాగా భార్యకు శిరోముండనం చేశాడు భర్త.

వివరాళ్లోకి వెళ్తే... అనకాపల్లి జిల్లా అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న వ్యక్తికి తాటిచెట్లపాలెం శ్రీనివాస నగర్ కు చెందిన మహిళతో 2013లో వివాహమైంది. ఈ క్రమంలో కొన్నేళ్లుగా కానిస్టేబుల్ అయిన ఆ భర్త.. ఆమెను అదనపు కట్నం కోసమని, అనుమానంతో అని రకరాలుగా వేదిస్తూ చిత్రహింసలకు గురిచేసేవాడట. పైగా అవి కాస్తా ఇటీవల కాలంలో మరింత పెరిగాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో... ఈ నెల 18న రాత్రి ఆమెను కొట్టడంతో పాటు ఇంట్లో ఉన్న ట్రిమ్మర్ తో గుండు గీసి, కనుబొమ్మలు తీసేశాడని తెలుస్తుంది. దీంతో బాధితురాలు ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో... జరిగిన అన్యాయంపై వారు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కానిస్టేబుల్ పై హత్యాయత్నం, అదనపు కట్నం వేధింపుల కింద కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేశారని తెలుస్తుంది!