Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో... దీన్ని చూస్తే ఆర్టీవో ఇన్స్‌పెక్టర్ ఎలా ఫీలవుతాడో?

అవును... తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఇద్దరు యువకులు ఒక సోఫాలో కూర్చుని రోడ్డుపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లిపోతున్నారు.

By:  Tupaki Desk   |   1 Jan 2024 2:30 AM GMT
వైరల్  వీడియో... దీన్ని చూస్తే ఆర్టీవో ఇన్స్‌పెక్టర్  ఎలా ఫీలవుతాడో?
X

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఇన్నోవేషన్స్ నిత్యం జరుగుతూనే ఉంటాయి. ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల్లో టెక్నాలజీ పరంగా నిత్యం కొత్త కొత్త ఇన్నోవేషన్స్ జరుగుతుంటాయని అంటారు. అయితే ఈ సోషల్ మీడియా కాలంలో ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఆ సరికొత్త రూపకల్పనలను వీక్షించే అవకాశం అందరికీ దక్కుతుంది. ఈ సందర్భంగా తాజాగా రోడ్డుపై ప్రయాణిస్తున్న సోఫాకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అవును... తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఇద్దరు యువకులు ఒక సోఫాలో కూర్చుని రోడ్డుపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లిపోతున్నారు. ఎదురుగా వాహనాలు వస్తున్నప్పుడు, టర్నింగ్స్ వచ్చినప్పుడు ఆ సోఫాను కంట్రోల్ చేస్తూ ముందుకు కదులుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు అత్యంత ఆసక్తిగా మారగా... దీనిపై ఆనంద్ మహీంద్ర కూడా స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వివరాళ్లోకి వెళ్తే... ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటూ.. ఆసక్తికరమైన ఎన్నో విషయాలను పంచుకుంటూ ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆటోమొబైల్ రంగంలో తెరపైకి వచ్చే సరికొత్త ఇన్నోవేషన్స్ ని ఆయన రెగ్యులర్ గా ఫాలో అవుతూ.. వాటిపై తన స్పందనను తెలియజేస్తూ ఉంటారు. మరికొంతమందిని తనదైన శైలిలో ప్రోత్సహిస్తుంటారు.

ఈ క్రమంలో తాజాగా తన ఎక్స్ లో ఒక వీడియోను పోస్ట్ చే శారు. ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఒక సోఫాపై కూర్చుని ప్రయాణిస్తూ ఉంటారు. ఇదెలా తయారైందనేది ఆ వీడియో చూస్తే మొత్తం అర్థమైపోతుంది. ఒక సోఫాను ఆన్‌ లైన్ సోఫాను ఆర్డర్ చేసిన దానికి చక్రాలు, మోటార్ వంటి భాగాలను.. కంట్రోల్ చేయడానికి ఒక హ్యాండ్ బ్రేక్ లాంటి పరికరాన్ని అమర్చారు! ఇది అత్యంత ఆసక్తిగా ఉంది!

దీంతో ఈ వీడియోను పోస్ట్ చేసిన ఆనంద్ మహేంద్ర... "ఇది కేవలం ఓ సరదా ప్రాజెక్టు మాత్రమే.. అయితే ఇందులో ఆ యువకుల అభిరుచి, ప్రయత్నం తప్పకుండా ప్రశంసనీయం. ఒక దేశం ఆటోమొబైల్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందాలంటే ఇలాంటి సరికొత్త ఆవిష్కరణలు ఎంతైనా అవసరం" అని అన్నారు. ఇదే సమయంలో... "ఈ వెహికల్ చూస్తే ఆర్టీవో ఇన్స్‌పెక్టర్ ఎలా ఫీలవుతాడో చూడాలనుకుంటున్నా అని ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని వీక్షించిన వేలాదిమంది నేటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు పెడుతున్నారు.