19 ఏళ్ల యువతిపై 23 మంది 6 రోజుల అత్యాచార కాండ.. మోడీ ఇలాకాలో
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఈ అరాచక అత్యాచార కాండ చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 8 April 2025 4:43 AMదారుణ ఉదంతం ఒకటి వెలుగు చూసింది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఈ అరాచక అత్యాచార కాండ చోటు చేసుకుంది. 19 ఏళ్ల యువతిపై 23 మంది కీచకులు ఆరు రోజుల పాటు సాగించిన దారుణం గురించి తెలిస్తే రక్తం మరిగిపోవాల్సిందే. ఆమెకు మత్తు మందు ఇచ్చి.. పలు హోటళ్లు తిప్పుతూ అఘాయిత్యానికి పాల్పడ్డారు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
మార్చి 29న బాధితురాలు తన స్నేహితుల ఇంటికి వెళ్లింది. ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో రాజ్ విశ్వకర్మ అనే యువకుడ్ని కలిసింది. అతను తన కేఫ్ కు తీసుకెళ్లాడు. ఆమెపై అక్కడ అత్యాచారం జరిగింది. విశ్వకర్మ.. రాజ్.. అతడి స్నేహితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాతి రోజు ఆ యువతిని సమీర్ అనే వ్యక్తి కలిశాడు. తన స్నేహితులతో కలిసి ఆమెను బైక్ మీద కూర్చెబెట్టుకొని నేషనల్ హైవే మీదకు తీసుకెళ్లి.. అక్కడ అత్యాచారం చేసి.. నదేసర్ ప్రాంతంలో వదిలి వెళ్లాడు.
మార్చి 31న ఆయుష్ అనే యువకుడు తన ఐదుగురు స్నేహితులతో కలిసి సిగ్రాలోని కాంటినెంటల్ కేఫ్ కు ఆమెను తసుకెళ్లి.. వారంతా అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తు మందు ఇచ్చి,. ఈ దారుణానికి ఒడికట్టారు. ఈ నెల ఒకటిన తన స్నేహితుడితో కలిసి సాజిద్ అనే నిందితుడు ఆమెను హోటల్ కు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరు.. ముగ్గురు కలిసి ఆమెను అత్యాచారం చేశారు. అందులో ఒకడు ఆమెను బయటకు పంపేశాడు. అక్కడి నుంచి బయలుదేరిన ఆమె ఇమ్రాన్ అనే యువకుడ్ని కలవటం.. అతనూ ఆమెను హోటల్ కు తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. రెండో తేదీన రాజ్ ఖాన్ అనే నిందితుడు ఆమెను హుకుల్ గంజ్ లోని తనకు ఇంటికి తీసుకెళ్లాడు. మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేయబోగా.. గట్టిగా కేకలు వేసింది.
దీంతో ఆమెను అక్కడి నుంచి స్నేహితులతో కలిసి అస్సీ ఘాట్ కు తీసుకెళ్లాడు. అక్కడ మత్తు మందు ఇచ్చారు. మూడో తేదీన డానిష్ అనే నిందితుడు ఆమెను తన స్నేహితుడి గదికి తీసుకెళ్లి.. సోహైల్.. షోయబ్ తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. తమ కుమార్తె కనిపించటం లేదని బాధితరాలు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఆమెను కనిపెట్టేలోపు.. ఈ నెల నాలుగున ఆమె ఇంటికి చేరుకుంది. కాస్త తేరుకున్న తర్వాత తనపై జరిగిన సామూహిక అత్యాచార కాండ గురించి చెప్పటంతో.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ ఉదంతం వెలుగు చూసింది.