Begin typing your search above and press return to search.

పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి.. కూతురి మెడలో తాళి కట్టించాడు

తన కుమార్తెకు పెళ్లి చేయటం కోసం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఇటీవలే జాబ్ సంపాదించిన వ్యక్తిని కిడ్నాప్ చేసి మరీ కూతురి మెడలో తాళి కట్టించాడో తండ్రి.

By:  Tupaki Desk   |   2 Dec 2023 4:30 PM GMT
పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి.. కూతురి మెడలో తాళి కట్టించాడు
X

పురాణాల్లో రాక్షస వివాహం గురించి చదివే వింటారు. తాజాగా బిహార్ లో జరిగిన ఒక పెళ్లి గురించి తెలిస్తే నోటి వెంట మాట రాని పరిస్థితి. ఇలా కూడా పెళ్లి చేస్తారా? అన్న షాక్ లో మునిగిపోవటం ఖాయం. సినిమాల్లో చూపించే సీన్ లాంటిది రియల్ లైఫ్ లో ఎదురుకావటం సంచలనంగా మారింది. స్థానికంగా హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతం బిహార్ లోని వైశాలి జిల్లాలో చోటు చేసుకుంది. తన కుమార్తెకు పెళ్లి చేయటం కోసం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఇటీవలే జాబ్ సంపాదించిన వ్యక్తిని కిడ్నాప్ చేసి మరీ కూతురి మెడలో తాళి కట్టించాడో తండ్రి.

వైశాలి జిల్లాకు చెందిన గౌతమ్ కుమార్ ఇటీవల ప్రభుత్వ టీచర్ గా జాబ్ సాధించాడు. ఇటీవలే విధుల్లోకి చేరిన అతడ్ని.. తాజాగా అతడింటికి కారులో వచ్చిన కొందరు వ్యక్తులు.. బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లారు. స్థానికంగా ఈ ఉదంతం కలకలాన్ని రేపింది. కట్ చేస్తే.. గౌతమ్ ను అలా తీసుకెళ్లిన వ్యక్తులు రాజేశ్ రాయ్ అనే వ్యక్తికి వద్దకు తీసుకెళ్లారు. గతంలో అతను తన కుమార్తె చాందినీను పెళ్లాడాల్సిందిగా కోరాడు. కానీ.. రాజేశ్ అందుకు నో చెప్పాడు.

తాజాగా కిడ్నాప్ చేసిన అనంతరం.. గౌతమ్ తలకు పాయింట్ బ్లాక్ లో గన్ ను గురి పెట్టి.. తన కుమార్తెను పెళ్లాడాల్సిందిగా కోరాడు. దీంతో.. మరో మార్గం లేక ఆమె మెడలో తాళి కట్టాడు. అనంతరం.. కొత్త దంపతుల్ని తన ఇంట్లోనే ఉంచేశాడు. తమ కుమారుడ్ని కిడ్నాప్ చేశారన్న గౌతమ్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు.. అతడి కోసం రాజేశ్ ఇంటికి వెళ్లగా.. అప్పటికే పెళ్లై.. వారిద్దరిని తన ఇంట్లోనే బంధించిన విషయాన్ని గుర్తించారు. తన చేత బలవంతంగా తాళి కట్టించినట్లుగా గౌతమ్ పోలీసుల ఎదుట వాపోయాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఉదంతంపై విచారణ షురూ చేశారు. ఈ వైనం సంచలనంగా మారింది.