Begin typing your search above and press return to search.

వైసీపీ నేత బోరుగ‌డ్డ‌పై హైకోర్టు సీరియ‌స్‌.. ఏం జ‌రిగింది?

వైసీపీ నాయ‌కుడు.. సోష‌ల్ మీడియాలో సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌పై ఇష్టాను సారంగా వ్యాఖ్య‌లు చేయ‌డంతోపాటు.. వారి ఇంట్లోని మ‌హిళ‌ల‌పైనా నోరు చేసుకున్న బోరుగ‌డ్డ అనిల్ కుమార్‌కు హైకోర్టులో భారీ షాక్ త‌గిలింది.

By:  Tupaki Desk   |   18 April 2025 4:41 AM
HC Denies Bail to YSRCP Leader Borugadda Anil Kumar
X

వైసీపీ నాయ‌కుడు.. సోష‌ల్ మీడియాలో సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌పై ఇష్టాను సారంగా వ్యాఖ్య‌లు చేయ‌డంతోపాటు.. వారి ఇంట్లోని మ‌హిళ‌ల‌పైనా నోరు చేసుకున్న బోరుగ‌డ్డ అనిల్ కుమార్‌కు హైకోర్టులో భారీ షాక్ త‌గిలింది. అంతేకాదు.. హైకోర్టు కూడా.. ఆయ‌న‌పై తీవ్రంగా మండిప‌డిం ది. ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్న బోరుగ‌డ్డ అనిల్‌.. త‌న‌కు బెయిల్ ఇవ్వాల‌ని పిటిష‌న్ దాఖ‌లు చేసుకున్నారు.

ఈ పిటిష‌న్ వాస్త‌వానికి శుక్ర‌వారం విచార‌ణ‌కు రావాల్సి ఉంది. కానీ, రాలేదు. ఈ విష‌యాన్నే బోరుగ‌డ్డ త‌ర‌ఫున న్యాయ‌వాది హైకోర్టును ప్ర‌శ్నించారు. బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిగి.. సాధ్య‌మైనంత వేగంగా బెయిల్ ఇవ్వాల‌ని కోరారు. అయితే.. కోర్టును, పోలీసుల‌ను కూడామోసం చేశార‌ని.. ముందు ఆ కేసు తేలిన త‌ర్వాతే.. బోరుగ‌డ్డ‌కు బెయిల్ ఇచ్చే విష‌యంపై దాఖ‌లైన పిటిష‌న్‌ను విచార‌ణ చేస్తామ‌ని హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు.. త‌ల్లిదండ్రుల‌ను చంపేసిన వ్య‌క్తి.. తాను అనాథ‌న‌ని బెయిల్ ఇవ్వ‌మ‌ని కోరుతున్న‌ట్టుగా ఉంద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

సోష‌ల్ మీడియాలో అనుచిత వ్యాఖ్య‌లు చేసిన బోరుగ‌డ్డను రెండు మాసాల కింద‌టే పోలీసులు అరెస్టు చేసి రాజ‌మండ్రి జైలుకు త‌రలించారు. అయితే.. అప్పట్లోనే ఆయ‌న బెయిల్ పిటిష‌న్ పెట్టుకున్నారు. త‌న త‌ల్లికి బాగోలేద‌ని.. ఆసుప‌త్రిలో ఉన్నార‌ని.. చెన్నై వెళ్లి ఆమె ఆరోగ్యాన్నిమెరుగు ప‌రిచేలా చూడాల్సి న బాధ్య‌త త‌న‌పై ఉంద‌ని పేర్కొన్నారు. దీంతో కోర్టు ఆయ‌న‌కు బెయిల్ ఇచ్చింది. అయితే.. ఈ క్ర‌మంలో బోరుగ‌డ్డ కోర్టుకు స‌మ‌ర్పించిన డాక్ట‌ర్ స‌ర్టిఫికెట్‌పై పోలీసుల‌కు అనుమానం వ‌చ్చింది.

తీగ‌లాగితే డొంక క‌దిలిన‌ట్టుగా.. ఈ కేసును విచారించ‌గా.. స‌ద‌రు స‌ర్టిఫికెట్ ఇచ్చిన డాక్ట‌ర్ లలితా సూపర్ స్పెషాల్టీ హాస్పటల్ వైద్యుడు డాక్టర్ పివి రాఘవ శర్మ తాను ఆ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌లేద‌న్నారు. దీంతో మ‌రో పిటిష‌న్ దాఖ‌లై.. బోరుగ‌డ్డ బెయిల్ ర‌ద్ద‌యింది. ఈ క్ర‌మంలో ఈ న‌కిలీ స‌ర్టిఫికెట్ వ్య‌వ‌హారం తేలిన త‌ర్వాతే.. రెగ్యుల‌ర్ బెయిల్ పిటిష‌న్ విచారిస్తామ‌ని హైకోర్టు తేల్చి చెప్పింది. అప్పుడు కూడా.. బోరుగ‌డ్డ త‌న స‌చ్చీల‌త‌ను నిరూపించుకోవాల‌ని పేర్కొంది.