Begin typing your search above and press return to search.

చంద్రబాబు 2024లో చస్తాడు: గోరంట్ల

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 2024లో చంద్రబాబు చస్తాడని...జగన్ మోహన్ రెడ్డి సీఎం అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   27 Oct 2023 5:59 AM GMT
చంద్రబాబు 2024లో చస్తాడు: గోరంట్ల
X

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 2024లో చంద్రబాబు చస్తాడని...జగన్ మోహన్ రెడ్డి సీఎం అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో పాల్గొన్న గోరంట్ల మాధవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. చంద్రబాబు బస్సు యాత్ర చేసి, ఆ తర్వాత జైలు యాత్ర చేస్తున్నాడని గోరంట్ల మాధవ్ అవమానకర రీతిలో వ్యాఖ్యానించారు.

లోకేష్ పాదయాత్ర మొదలుబెట్టి పిల్లి యాత్ర చేస్తున్నాడంటూ వివాదాస్పద రీతిలో వ్యాఖ్యానించారు. ఇక పవన్ వారాహి యాత్ర ఆపేసి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని వెటకారంగా వ్యాఖ్యానించారు. లోకేష్ తన పాదయాత్ర చుట్టిపెట్టి పారిపోయాడంటూ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైల్లోనే చంద్రబాబును చంపేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహా పలువురు టీడీపీ నేతలు ఇప్పటికే ఆరోపించిన నేపథ్యంలో తాజాగా గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఆరోపణలకు ఊతమిచ్చేలా ఉన్నాయని టిడిపి నేతలు మండిపడుతున్నారు.

గతంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఇదే తరహాలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గన్మెన్లను, జెట్ క్యాటగిరి సెక్యూరిటీని తీసేస్తే చంద్రబాబు ఫినిష్ అంటూ సీతారాం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇప్పుడు అదే తరహాలో గోరంట్ల మాధవ్ కూడా వ్యాఖ్యానించడంతో చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టేలా వైసీపీ నేతల మాటలు, చేతలు ఉన్నాయని సోషల్ మీడియాలో సైతం విమర్శలు వస్తున్నాయి. ఇక తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ సీఎం జగన్ వాటిని ఖండించకపోవడం మరిన్ని విమర్శలకు తావిస్తోంది.