స్మార్ట్ఫోన్ వినియోగంలో అమెరికాను దాటేసిన భారత్.. తేడా ఎంతో తెలుసా ?
భారత్, అమెరికా మధ్య 40 కోట్ల స్మార్ట్ఫోన్ వినియోగదారుల తేడా ఉంది. అయితే అమెరికా జనాభా భారతదేశం కంటే చాలా తక్కువ.
By: Tupaki Desk | 18 May 2025 2:30 AMఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ ప్రతి ఒక్కరికి తప్పనిసరి అవసరంగా మారిపోయింది. చదువు, ఉద్యోగం, వినోదం ఇలా ప్రతి పనికీ ఫోన్ కావాల్సిందే.చిన్న పిల్లల దగ్గర్నుంచి వృద్ధుల వరకు స్మార్ట్ ఫోన్లను వాడేస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ఫోన్ల వినియోగం కూడా వేగంగా పెరుగుతోంది. ప్రపంచంలో స్మార్ట్ఫోన్లను ఉపయోగించడంలో ఏ దేశాలు ముందున్నాయో ఈ వార్తలో తెలుసకుందాం.
అగ్రస్థానంలో చైనా
ప్రపంచంలో అత్యధిక స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఉన్నటువంటి దేశం చైనా. ప్రపంచంలో చైనా జనాభా చాలా ఎక్కువ, ప్రజలు టెక్నాలజీని కూడా చాలా ఫాస్టుగా స్వీకరిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం.. చైనాలో 100 కోట్లకు (బిలియన్) పైగా ప్రజలు స్మార్ట్ఫోన్లను ఉపయోగిస్తున్నారు. గ్రామాల నుంచి నగరాల వరకు ప్రతిచోటా మొబైల్ ఫోన్ సాధారణమైపోయింది.
అమెరికా కంటే ముందున్న భారత్
ఈ జాబితాలో భారత్ రెండవ స్థానంలో ఉంది. భారతదేశంలో దాదాపు 70 కోట్ల (700 మిలియన్) మంది స్మార్ట్ఫోన్లను ఉపయోగిస్తున్నారు. దీనికి కారణం చౌకైన ఇంటర్నెట్ తక్కువ ధరలో స్మార్ట్ఫోన్లు, ప్రతిచోటా నెట్వర్క్ అందుబాటులో ఉండడం. ముఖ్యంగా యువతలో స్మార్ట్ఫోన్ల వినియోగం చాలా వేగంగా పెరుగుతోంది. సోషల్ మీడియా, ఆన్లైన్ క్లాసులు, డిజిటల్ పేమెంట్స్ దీనిని మరింత ప్రాచుర్యం పొందాయి. భారతదేశ జనాభా అమెరికా కంటే ఎక్కువ కాబట్టి ఇక్కడ స్మార్ట్ఫోన్ వినియోగదారుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. భారతదేశంలో టెక్నాలజీ అభివృద్ధి వేగంగా జరుగుతోంది. కాబట్టి స్మార్ట్ఫోన్ వినియోగదారుల సంఖ్య మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంది.
తక్కువ జనాభా, ఎక్కువ స్మార్ట్ఫోన్లు
స్మార్ట్ఫోన్ వినియోగదారుల విషయంలో అమెరికా మూడవ స్థానంలో ఉంది. ఇక్కడ 30 కోట్లకు (300 మిలియన్) పైగా ప్రజలు స్మార్ట్ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అమెరికా జనాభా భారత్, చైనా కంటే తక్కువ.. కానీ అక్కడ టెక్నాలజీ చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది. దాదాపు ప్రతి వ్యక్తి వద్ద స్మార్ట్ఫోన్ ఉంది. వారు దానిని పని, ఇమెయిల్, ఆన్లైన్ షాపింగ్, వినోదం కోసం ఉపయోగిస్తారు.
భారత్, అమెరికా మధ్య 40 కోట్ల స్మార్ట్ఫోన్ వినియోగదారుల తేడా ఉంది. అయితే అమెరికా జనాభా భారతదేశం కంటే చాలా తక్కువ.చైనా, భారత్ తరువాత ఇండోనేషియా, బ్రెజిల్, రష్యా, జపాన్ వంటి దేశాలు కూడా స్మార్ట్ఫోన్ వినియోగదారుల విషయంలో ముందున్నాయి. కానీ చైనా, భారత్తో పోటీ పడడం మాత్రం కష్టమే.