Begin typing your search above and press return to search.

రైల్లో పరిచయం.. పెళ్లి చేసుకున్న అతడికి దిమ్మ తిరిగే షాక్!

కోరుకున్నంత డబ్బులు సంపాదించాలంటే కష్టపడాలి. అంతే తప్పించి మోసం చేయకూడదు.

By:  Tupaki Desk   |   30 Dec 2023 10:30 AM GMT
రైల్లో పరిచయం.. పెళ్లి చేసుకున్న అతడికి దిమ్మ తిరిగే షాక్!
X

కోరుకున్నంత డబ్బులు సంపాదించాలంటే కష్టపడాలి. అంతే తప్పించి మోసం చేయకూడదు. ఒకవేళ చేసినా అట్టే దాచలేం. ఏదో ఒకరోజు ఆ తప్పులన్ని బద్ధలు కావాల్సిందే. తాజాగా వెలుగు చూసిన ఒక ఉదంతం గురించి తెలిస్తే షాక్ తింటాం. నోటి వెంట మాట రాదంతే. ధరించే దుస్తుల్ని మార్చినంత సింఫుల్ గా భర్తల్ని మార్చేసే ఒక కిలేడీ ఉదంతం వెలుగు చూసింది. కర్ణాటకకు చెందిన ఈ లేడీ కన్నింగ్ వ్యవహారం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

ఒకరికి తెలీకుండా మరొకరిని మొత్తం నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న పాతికేళ్ల స్నేహ అసలు స్వరూపం ఎలా బయటపడింది? అన్న విషయంలోకి వెళితే.. మండ్య జిల్లా పాండవపురకు చెందిన స్నేహకు రైల్లో వెళుతున్న ప్రశాంత్ కు పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారి.. వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. దావణగెరెలో కాపురం పెట్టారు. ఇంతవరకుబాగానే ఉంది. కొద్ది రోజుల క్రితం తాను గర్భవతిని అని చెప్పిన ఆమె పుట్టింటికి వెళ్లింది. తిరిగి ఇంటికి రమ్మంటే రానని చెప్పేది. దీంతో.. ఆమె ఇచ్చిన అడ్రస్ ప్రకారం వెళ్లిన ప్రశాంత్ కు షాక్ తగిలింది.

ఎందుకంటే.. స్నేహ ఇచ్చిన అడ్రస్ లో ఆమె లేదు. దీంతో తన భార్య కనిపించటం లేదంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు ప్రశాంత్. వారు విచారించి అతడికి దిమ్మ తిరిగిపోయే నిజాన్ని చెప్పుకొచ్చారు. స్నేహకు అప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగాయని.. ప్రశాంత్ మూడో భర్త అని.. తాజాగా మరొకరిని పెళ్లి చేసుకుందని చెప్పటంతో అవాక్కు అయ్యాడు. ఆమె జాడ తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు మరింత శోధించాల్సి వచ్చింది.

చివరకు ఆమె జాడ తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు వెళ్లే సరికి ఆమె తన నాలుగో భర్త రఘుతో ఉన్న విషయాన్ని గుర్తించారు. తొలుత బెంగళూరుకు చెందిన రఘు అనే యువకుడ్ని పెళ్లాడింది. తర్వాత అతడ్ని విడిచి పెట్టిన ఆమె.. వెంకటేశ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతన్ని వదిలేసి.. రైల్లో పరిచయమైన దావణగెరెకు చెందిన ప్రశాంత్ ను పెళ్లాడింది. ఇప్పుడు రఘును పెళ్లాడిన ఈ నిత్య పెళ్లికూతుర్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు