Begin typing your search above and press return to search.

అసలు వాళ్లకు మంగళసూత్రాలున్నాయా ?

‘నా తండ్రి రాజీవ్‌ గాంధీని కోల్పోవడం ద్వారా నా తల్లి సోనియా మంగళ సూత్రాన్ని త్యాగం చేసింది.

By:  Tupaki Desk   |   28 April 2024 5:30 PM GMT
అసలు వాళ్లకు మంగళసూత్రాలున్నాయా ?
X

ప్రధాని మోడీ ఏ ముహూర్తాన ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ అేధికారంలోకి వస్తే మహిళల మంగళసూత్రాలు తెంపుతుంది అన్నాడో గానీ అది చిలికి చిలికి గాలివానగా మారుతుందా అని అనిపిస్తుంది. ఈ చర్చ చివరికి కాంగ్రెస్, బీజేపీలలో ఎవరికి మేలు చేస్తుంది అన్నది కూడా అనుమానమే.

ప్రధాని మోడీ వ్యాఖ్యలపై స్పందించిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ‘నా మెడలో మంగళసూత్రం తెంచే దమ్ము ఎవడికి ఉంది ? మోడీకి మాంగళ్యం విలువ తెలియదు. మోడీ తాళికట్టిన వ్యక్తి ఇప్పుడు దిక్కూ, మొక్కూ లేకుండా ఉంది’ అని తీవ్రంగా స్పందించింది.

‘నా తండ్రి రాజీవ్‌ గాంధీని కోల్పోవడం ద్వారా నా తల్లి సోనియా మంగళ సూత్రాన్ని త్యాగం చేసింది. నా నానమ్మ ఇందిరా గాంధీ కూడా ఈ దేశం కోసం తన ప్రాణాలను అంకితం చేసిందని’ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందించింది.

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘’త్యాగాలు చేయడానికి అసలు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీలకు మంగళసూత్రాలు ఉన్నాయా? ఇటలీ నుంచి వచ్చిన సోనియాకు మంగళసూత్రం ఉంటుందో లేదో నాకైతే తెలియదు. అలాగే ఇందిరా గాంధీని పెళ్లాడిన ఫిరోజ్‌ గాంధీ పార్సీ మతస్తుడు’ అని అన్నాడు.

ఉత్తర భారతంలో పార్లమెంట్ ఎన్నికలలో ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో మోడీ ప్రచారసరళిని వివాదాస్పదంగా మార్చేశారని, ఓటమి భయంతోనే ఇలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మరి ఇలాంటి వ్యాఖ్యలు ఎటు దారితీస్తాయో వేచిచూడాలి.