Begin typing your search above and press return to search.

జగన్ పిలిచినా ...షర్మిల అలా...!

2019 ఎన్నికల ప్రచారం తరువాత వైసీపీలో షర్మిల కనిపించినదీలేదు దాంతో ఈ ఇద్దరి మధ్య ఏమి జరిగింది.

By:  Tupaki Desk   |   18 Jan 2024 4:59 PM GMT
జగన్ పిలిచినా ...షర్మిల అలా...!
X

మేనల్లుడి వివాహ నిశ్చితార్ధానికి ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ వెళ్లారు. వేదిక వద్ద కొద్ది సేపు జగన్ దంపతులు గడిపారు. మేనల్లుడు రాజారెడ్డిని జగన్ హత్తుకున్నారు. అలాగే కొత్త పెళ్ళి కూతురిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జగన్ షర్మిల వైపే అందరి చూపులూ ఉన్నాయి.

ఎందుకంటే 2019 తరువాత బహిరంగంగా అన్నా చెల్లెలూ ఎక్కడా కలుసుకోలేదు. 2019 ఎన్నికల ప్రచారం తరువాత వైసీపీలో షర్మిల కనిపించినదీలేదు దాంతో ఈ ఇద్దరి మధ్య ఏమి జరిగింది. ఏమై ఉంటుంది అన్న చర్చ అయితే జనంలో ఉంది.

ఇక అలా నాలుగున్నరేళ్ళ పాటు సాగిన ప్రజల ఉత్కంఠ అంతా షర్మిల కొడుకు వివాహ నిశ్చితార్ధం వేళ ఇంకా ఎక్కువ అయింది. అసలు షర్మిల తన కొడుకు పెళ్ళికి జగన్ని పిలుస్తుందా అన్న చర్చ నడచింది. కానీ ఆమె పిలిచారు. పోనీ ఆమె పిలిచారు జగన్ వెళ్తారా అని మరో కొత్త చర్చకు తెర లేపారు.

జగన్ వెళ్తారు అన్న వార్త రాగానే మరింత ఉత్సాహం అందరిలోనూ కనిపించింది. మీడియా అయితే ఫుల్ ఫోకస్ అటు వైపు పెట్టేసింది. సరిగ్గా గురువారం రాత్రి గోల్కొండ హొటల్ వేదికగా జరిగిన ఈ వేడుకలో జగన్ వేదిక వద్దకు చేరుకున్న ప్రతీ సెకన్ అంతా కళ్లార్పకుండా చూశారు.

జగన్ అందరినీ పలకరించారు. వేదిక వద్దకు వెళ్ళి మేనల్లుడిని అభినందించారు. ఇక ఆ మీదట పూల బొకెని నూతన దంపతులకు ఇస్తూ అందరితో గ్రూప్ ఫోటోకు రెడీ అయ్యారు జగన్. ఆ సమయంలో సోదరికి గ్రూప్ ఫోటో కోసం పిలిచారు. అయితే వెనకనే ఉన్న షర్మిల మాత్రం ముందుకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదని విజువల్స్ లో కనిపించింది.

తల్లి విజయమ్మ కుమార్తె కూడా షర్మిలను పిలిచారు. ఇక భర్త అనిల్ ఆమె చేయి పట్టుకుని జగన్ ఉన్న వైపు నకు నడిపించే ప్రయత్నం చేశారు. అయితే షర్మిల మాత్రం అక్కడ వరకూ వెళ్లకుండా అన్నకు దూరంగానే ఉంటూ గ్రూప్ ఫోటోలో కనిపించారు. ఆ తరువాత చూస్తే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వచ్చినపుడు సినీ నటుడు మోహన్ బాబు వచ్చినపుడు మాత్రం వారి పక్కన నిలబడి ఫోటోలలో కనిపించిన షర్మిల అన్న పిలిచినా ఆయన పక్కకు ఎందుకు రాలేదు అన్నది మాత్రం ఒక చర్చగానే మిగిలింది.

మొత్తానికి చూస్తే అన్నా చెల్లెళ్ల మధ్య ఏదో ఉందని అనుకునే వారికి ఏదో ఉందనేది మాత్రం ఈ వేడుక ద్వారా మరింత అర్ధమయ్యేలా ఈ పరిణామాలు చేసేలా అన్నది చర్చగానే ఉంది. ఇక ఈ విజువల్స్ చూసిన నెటిజన్లు కొందరు మాత్రం షర్మిల వ్యవహరించిన తీరుని తప్పు పట్టారు. మరి కొందరు అయితే జగన్ గెస్ట్ లా వచ్చి వెళ్లిపోయారు అని కామెంట్స్ చేశారు. ఏది ఎలా ఉన్నా ఆర్జీవీకి సినిమా తీసేందుకు మసాలా స్టోరీ దొరికింది అని మరి కొందరు నెటిజన్లు పేర్కొనడం విశేషం.