Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం... తెరపైకి టి.బీజేపీ నేత కుమారుడు!

గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌ లో ఆదివారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించగా.. భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడినట్లు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   26 Feb 2024 7:17 AM GMT
హైదరాబాద్  లో డ్రగ్స్  కలకలం... తెరపైకి టి.బీజేపీ నేత కుమారుడు!
X

హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగం, వ్యాపారం వంటి వ్యవహారాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ భాగ్యనగరంలో డ్రగ్స్ దందా కొనసాగుతూనే ఉంది.. వారంతా పట్టుబడుతూనే ఉన్నారు! ఈ క్రమంలో తాజాగా మరో వ్యవహారం తెరపైకి వచ్చింది.

అవును... గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌ లో ఆదివారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించగా.. భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడినట్లు తెలుస్తుంది. ఇక్కడ భారీ ఎత్తున కొకైన్ పార్టీ ఏర్పాటు చేసుకుని ఉంటారని అంటున్నారు. ఈ ఆపరేషన్‌ లో ప్రముఖ వ్యాపారవేత్తతో సహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారని తెలుస్తుంది.

ఇదే సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్న డ్రగ్స్ కి సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సమయలో తెలంగాణకు సంబంధించిన ఒక రాజకీయ నాయకుడితో సంబంధం ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారని అంటున్నారు!

ఈ విషయాలపై స్పందించిన డీసీపీ వినీత్... "డ్రగ్స్ సేవించడం, ఈ వ్యవహారంలో ప్రమేయం కలిగి ఉన్న వ్యక్తుల గురించి మరిన్ని వివరాలను వెలికితీసేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి" అని అన్నారు. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థి ప్రమేయంపైనా దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తుంది.

ఈ సమయంలో తాజా వ్యవహారంలో టి.బీజేపీ నేత కుమారుడు తన స్నేహితులతో కలిసి ఈ హోటల్ లో కొకైన్ వాడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో అతనితో పాటు అతని స్నేహితుడికి డ్రగ్ పరీక్షలు నిర్వహించిన తర్వాత కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది!