Begin typing your search above and press return to search.

రూ.15 లక్షలు ఇస్తేనే ఫస్ట్ నైట్.. కంప్లైంట్ చేసిన భార్య

ఒకడు.. పెళ్లి తర్వాత మాత్రం తన గొంతెమ్మ కోర్కెల్ని బయటపెట్టటమే కాదు.. రూ.15 లక్షలు ఇచ్చిన తర్వాతే శోభనమంటూ వేధిస్తున్న షాకింగ్ ఉదంతం తాజాగా వెలుగు చూసింది.

By:  Tupaki Desk   |   7 Jan 2024 4:16 AM GMT
రూ.15 లక్షలు ఇస్తేనే ఫస్ట్ నైట్.. కంప్లైంట్ చేసిన భార్య
X

పోయే కాలం కాకుంటే.. బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ.. పైసల కక్కుర్తితో ఇబ్బందుల్లోకి చిక్కుకుపోయే ప్రబుద్దులు కొందరు ఉంటారు. తాజా ఉదంతం కూడా ఆ కోవకు చెందినదే. కట్న కానుకలు తనకు అక్కర్లేదంటూ ఆదర్శాలు వల్లిస్తూ పెళ్లి చేసుకున్న ఒకడు.. పెళ్లి తర్వాత మాత్రం తన గొంతెమ్మ కోర్కెల్ని బయటపెట్టటమే కాదు.. రూ.15 లక్షలు ఇచ్చిన తర్వాతే శోభనమంటూ వేధిస్తున్న షాకింగ్ ఉదంతం తాజాగా వెలుగు చూసింది.

కర్ణాటకలోని బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు అందరి నోట నానుతోంది. 2022 జూన్ ఆరున తమ పెళ్లి జరిగినట్లుగా బాధితురాలు పేర్కొన్నారు. పెళ్లి వేళలో.. తనకు కట్న కానుకల మీద ఆసక్తి లేదని.. తనకు డబ్బులు ఏమీ అక్కర్లేదని చెప్పిన అవినాశ్ వర్మ తనను పెళ్లాడినట్లుగా భార్య పేర్కొంది.

అయితే.. పెళ్లి తర్వాత నుంచి మాత్రం కట్న కానుకల కోసం వేధింపులు మొదలు పెట్టినట్లుగా ఆమె పేర్కొన్నారు. భర్త నుంచి వస్తున్న ఒత్తిళ్లకు కాదనలేని పరిస్థితుల్లో రూ.5.8 లక్షలు బాధితురాలి తల్లిదండ్రులు సర్దుబాటు చేశారు. అయితే.. తనకు రూ.15 లక్షలు ఇచ్చే వరకు శోభనానికి అంగీకరించనంటూ మొండిపట్టును ప్రదర్శిస్తున్న తీరుతో విసిగిపోయిన భార్య.. తాజాగా మహిళా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు.

అంతేకాదు.. ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ డబ్బులు ఇస్తేనే ఫస్ట్ నైట్ అని చెబుతూ వేధింపులకు గురి చేయటం.. తాను బాత్రూంలో ఉన్నప్పుడు.. బెడ్రూంలో ఉన్నప్పుడు ఇంట్లోని ఒకరు తన పట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నట్లుగా ఆమె వాపోయారు. ఆమె కంప్లైంట్ తీసుకున్న పోలీసులు.. ప్రాథమిక విచారణ చేపట్టారు. కట్నం కోసం ఇంతలా కక్కుర్తి పడే వాడితో వేధింపులకు గురి కావటం కంటే.. విడిగా ఉండటం మేలన్న విషయాన్ని బాధితురాలు గుర్తిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.