Begin typing your search above and press return to search.

ధ‌ర్మాన దారెటు?.. రాజ‌కీయ స‌న్యాస‌మేనా..!

మ‌రోవైపు.. ధ‌ర్మాన పూర్తిగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొంటున్నార‌ని.. ఆయ‌న‌కు ఇంట్ర‌స్ట్ కూడా లేద‌ని.. ఆయ‌న‌కు స‌న్నిహి తంగా ఉంటున్న నాయ‌కులు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   1 May 2025 1:30 AM
ధ‌ర్మాన దారెటు?.. రాజ‌కీయ స‌న్యాస‌మేనా..!
X

ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు చెందిన కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు రాజ‌కీయాలు ముగిశాయా? లేక‌.. కొన‌సాగుతాయా? అనేది ఆస‌క్తిగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న కుమారుడిని రంగంలోకి దింపాల ని అనుకున్నారు. కానీ, సాధ్యం కాలేదు. దీంతో అయిష్టంగానే శ్రీకాకుళం నుంచి పోటీ చేయ‌డం.. ప‌రాజ‌యం పాల‌వ‌డం తెలిసిం దే. అయితే.. ఆ త‌ర్వాత‌.. పార్టీలో ఎక్క‌డా ధ‌ర్మాన వారి స్వ‌రం వినిపించ‌డం లేదు. పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మొహం కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో ఇప్పుడు అస‌లు ఆయ‌న రాజ‌కీయాల్లో ఉన్న‌ట్టా? లేన‌ట్టా? అనేది చ‌ర్చ‌కు దారితీసింది.

ఇక‌, రాజ‌కీయంగా చూస్తే.. వైసీపీలో ధ‌ర్మాన ఒంట‌ర‌య్యార‌నేది ఏడాది కింద‌టే చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఉత్త‌రాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని ఆయ‌న అప్ప‌ట్లో బ‌హిరంగంగా విమ‌ర్శించ‌డం.. బూతులు తిట్ట‌డం.. వంటివి పార్టీ అధినా య‌క‌త్వానికి కూడా ఆగ్ర‌హం తెప్పించాయి. ``నీ పెత్త‌నాన్ని మేం స‌హించం`` అని అప్ప‌ట్లో మంత్రిగా ఉన్న ధ‌ర్మాన‌.. బ‌హిరంగ వేదిక‌పైనే వైవీ పై విరుచుకుప‌డ్డారు. దీంతో వైవీ అలిగి అంత‌ర్గ‌త స‌మావేశం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయినా.. గ‌త ఎన్నిక‌ల్లో ధ‌ర్మాన‌కు అవ‌కాశం ద‌క్కింది.

కానీ, ఆ త‌ర్వాత‌.. మాత్రం ఎక్క‌డా ఆయ‌న పేరు వినిపించ‌లేదు. ఇటీవ‌ల రాజ‌కీయ స‌ల‌హాదారుల క‌మిటీని నియ‌మించినా.. దానిలో కూడా.. ధ‌ర్మాన‌కు ప్రాధాన్యం ద‌క్క‌లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో ఇంచార్జ్‌గా ఉన్నా.. ఆయ‌న శ్రీకాకుళంలో ప‌ర్య‌టించ‌డ‌మూ లేదు. ఇక‌, త‌న కుమారుడు.. గ‌తంలో యాక్టివ్ గా రాజ‌కీయాలు చేయాల‌ని ప్రోత్స‌హించిన ధ‌ర్మాన‌.. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌..మౌనంగా ఉన్నారు. పైగా కూట‌మి స‌ర్కారు చేస్తున్న బాగానే ఉన్నాయ‌న్న‌ట్టుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న చ‌ర్చ కూడా ఉంది. ఈ ప‌రిణామాలు వైసీపీకి మింగుడు ప‌డ‌డం లేదు. దీంతో ప్ర‌సాద‌రావుకు ప్రాధాన్యంలేకుండా పోయింద‌ని చ‌ర్చ ఉంది.

మ‌రోవైపు.. ధ‌ర్మాన పూర్తిగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొంటున్నార‌ని.. ఆయ‌న‌కు ఇంట్ర‌స్ట్ కూడా లేద‌ని.. ఆయ‌న‌కు స‌న్నిహి తంగా ఉంటున్న నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. దీనిపై క్లారిటీ లేదు. పైకి మౌనంగా ఉన్నా.. ధ‌ర్మాన ఎన్నిక‌ల స‌మ‌యా నికి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు అయితే.. పార్టీ ప‌రంగా ధ‌ర్మాన యాక్టివ్‌గా అయితే లేరు. అలాగ‌ని పార్టీ నుంచి బ‌య‌ట‌కు కూడా రాలేదు. కానీ.. బ‌ల‌మైన గ‌ళం వినిపించిన ఆయ‌న ఇప్పుడు మౌనంగా ఉన్నార‌నేది వాస్త‌వం. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుంద‌నేది చూడాలి. ఇక‌, జ‌గ‌న్ కూడా.. ఇలాంటి వారి విష‌యంలో బుజ్జ‌గింపు రాజ‌కీయాలు చేసేందుకు ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.