Begin typing your search above and press return to search.

కత్తితో నాలుక తెగ నరుక్కున్న భక్తురాలు... వీడియో వైరల్!

ఈ నేపథ్యలో తాజాగా ఇలా భక్తి పారవశ్యంలోనో, మూఢభక్తి ముసుగులోనో ఒక యువతి కత్తితో నాలుక కోసుకుంది! దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   17 Oct 2023 5:19 AM GMT
కత్తితో నాలుక తెగ నరుక్కున్న భక్తురాలు... వీడియో వైరల్!
X

చాలా జాతరల్లోనూ, దేవాలయాల వద్ద జరిగే ఉత్సవాళ్లోనూ కొంతమందీ భక్తులు పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారనేది తెలిసిన విషయమే. దీంతో... వారి చుట్టుపక్కల ఉన్నవారు.. వీరిని దేవత పూనిందని చెబుతూ మరింత గట్టిగా పూజలూ, నినాదాలూ చేస్తుంటారు. ఈ నేపథ్యలో తాజాగా ఇలా భక్తి పారవశ్యంలోనో, మూఢభక్తి ముసుగులోనో ఒక యువతి కత్తితో నాలుక కోసుకుంది! దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... మూఢభక్తి ముసుగులో ఓ యువతి దారుణానికి పాల్పడింది. నవరాత్రుల సందర్భంగా గుడికి వెళ్లిన ఆమె ఉన్నపలంగా కత్తి చేతపట్టి నాలుక కోసుకుంది. అనంతరం ఆ నాలుకను దేవతకు అర్పించింది. దీంతో ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా దావాణంలా వ్యాపించగా.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే... ఆమె కత్తి చేతపట్టి నాలుక కట్ చేసుకోవడంతో.. దేవత పూనిందంటూ భక్తులు మరింతగా స్తుతించడం మొదలుపెట్టారు.

వివరాళ్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్‌ లోని ఖర్గోన్ జిల్లాలోని సాగూర్ భాగూర్‌ లో మాతా బాగేశ్వరి శక్తి ధామ్ ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైన, చారిత్రాత్మక దేవాలయం. ఈ నేపథ్యంలో తాజాగా మొదలైన దసరా నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీంతో... భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా నవరాత్రు ఉత్సవాలు భారీ ఎత్తున మొదలయ్యాయి.

ఈ సమయంలో భారీ ఎత్తున పూజలు చేస్తున్నవారిలో అమృత్ కుండ్‌ కు చెందిన ఓ యువతి కూడా ఉంది. భక్తిపారవశ్యంలో ఊగిపోతూ.. కత్తి చేతపట్టింది. దీంతో అక్కడున్న జనం అంతా మరింత బిగ్గరగా, ఉత్సాహంగా నినాదాలు చేయడం మొదలు పెట్టారు. మరికొంతమంది వీడియోలు తీయడం ప్రారంభించారు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ... కత్తి చేతపట్టిన ఆ యువతి అమాంతం కత్తితో నాలుకను నరికి దేవతకు సమర్పించింది.

అలా నాలుకను నరుక్కోవడంతో ఆమె నోటి నుంచి రక్తం ధారాపాతంగా కారిపోవడం మొదలైంది. ఇది వీడియోలో స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ అక్కడ ఉన్న భక్తుల్లో ఏక్కరూ కూడా ఆమెను రక్షించడానికి ప్రయత్నించలేదు సరికదా... ఈ సంఘటన తర్వాత భక్తులంతా మరింత పెద్ద ఎత్తున అమ్మవారిని స్తుతించడం మొదలుపెట్టారు. అనంతరం యువతి సృహతప్పి పడిపోయింది.

అనంతరం ఈ యువతిని దేవత పూనిందని అక్కడున్న వారంతా చెప్పుకొవడం మొదలుపెట్టారు. దీంతో ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు, తమ మొబైల్ ఫోన్ లలో వీడియోలు తీసేందుకు మాత్రం వందలాది మంది ప్రజలు పోటెత్తారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

కాగా... గత ఏడాది కూడా సంపత్ (40) అనే వ్యక్తి ఆలయ సంప్రదాయాలను ధిక్కరిస్తూ కౌశాంబిలోని శక్తిపీఠ్ కడ ధాం ఆలయంలో శీత్లా దేవికి నైవేద్యంగా తన నాలుకను అర్పించిన సంగతి తెలిసిందే. తనభార్యతో కలిసి కుబ్రి ఘాట్ వద్ద గంగాస్నానం చేసిన అనంతరం ఆలయంలో ప్రవేసించిన ఆ వ్యక్తి... తన భార్య పూజలూ చేస్తుండగా... నాలుకను నరుక్కుని దాన్ని దేవతకు సమర్పించాడు.