Begin typing your search above and press return to search.

మొద్దు శ్రీనులా చంపేస్తారేమో.. ఆమె సంచలనం

తాజాగా కడపలో ఆమె కొందరు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   2 Nov 2023 4:32 AM GMT
మొద్దు శ్రీనులా చంపేస్తారేమో.. ఆమె సంచలనం
X

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ కేసులో నిందితుడిగా ఉండి.. తర్వాత అప్రూవర్ గా మారిన దస్తగిరి సతీమణి. తన భర్తకు ప్రాణహాని ఉందన్నారు. ఈ సందర్భంగా పరిటాల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మొద్దు శ్రీనును ఎలా అయితే.. జైల్లో చంపేశారో.. అదే రీతిలో తన భర్తను జైల్లో చంపే కుట్ర చేస్తున్నట్లుగా ఆమె ఆరోపించారు.

తాజాగా కడపలో ఆమె కొందరు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అప్రూవర్ గా మారిన దస్తగిరిపై పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారన్నారు. ఈ మధ్యనే దస్తగిరిని వేరే కేసులో అరెస్టు చేశారన్నారు.

‘‘దస్తగిరి మీద పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేశారు. గతంలో జైల్లో మొద్దు శ్రీనును ఎలా హతమార్చారో.. అదే తరహాలో నా భర్తను కూడా హత్య చేస్తారని అనుమానంగా ఉంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన నా భర్తకు ప్రాణ హాని ఉంది. దస్తగిరిపై ఎంపీ అవినాష్ రెడ్డి పగ పెంచుకున్నారు. నా భర్తను వెంటనే విడుదల చేయాలి’ అంటూ దస్తగిరి భార్య షబానా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ దస్తగిరి మీద కడప పోలీసులు నమోదు చేసిన కేసులేంటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.